News April 1, 2025

భూకంప జోన్-3లో భద్రాచలం

image

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.

Similar News

News December 5, 2025

చంద్రుగొండలో రేషన్ బియ్యం పట్టివేత

image

చంద్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు. వాహన తనిఖీల్లో భాగంగా 280 క్వింటాళ్ల రేషన్ బియ్యం (విలువ రూ.5.60 లక్షలు) స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ అరుణ్‌కుమార్, రాజ్‌బార్ విచారణలో బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఛత్తీస్‌గఢ్‌కు అధిక ధరలకు తరలిస్తున్నట్లు ఒప్పుకొన్నారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News December 5, 2025

HNK కలెక్టరేట్లో ఆవిష్కరణకు సిద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహం

image

రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ప్రతిష్ఠాపన పనులు పూర్తయ్యాయి. ఈ విగ్రహాలను డిసెంబర్ 9న లాంఛనంగా ఆవిష్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హన్మకొండ కలెక్టరేట్‌లో స్థాపించిన విగ్రహాన్ని కూడా ప్రారంభించనున్నారు. తెలంగాణ తల్లి దినోత్సవాన్ని పాటిస్తూ, సోనియా గాంధీ పుట్టినరోజున ఈ ఆవిష్కరణ జరగనుంది.

News December 5, 2025

నర్సంపేట: సీఎంకు సమస్యల స్వాగతం

image

నర్సంపేటలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కోసం నేడు CM రేవంత్ వచ్చే నేపథ్యంలో అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. పట్టణ ప్రజల్లో కూడా ఉత్సాహం నెలకొంది. అయితే, సీఎం పర్యటన సమయానికే నర్సంపేటలోని పలు సమస్యలు స్వాగతం చెప్పేలా కనిపిస్తున్నాయి. పట్టణంలోని కొన్ని వార్డుల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతిని ఉండగా, మిషన్ భగీరథ పైప్‌లైన్లలో చోటుచేసుకున్న వాటర్ లీకేజీలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నాయి.