News April 1, 2025

భూకంప జోన్-3లో భద్రాచలం

image

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.

Similar News

News November 21, 2025

BREAKING: వరంగల్: 8 మంది ఎస్ఐల బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 8 మంది ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఎస్.రాజన్‌బాబు, బి.రాజేశ్ కుమార్, ఎన్.కృష్ణవేణి, నిసార్ పాషా, బి.రవీందర్, బి.విజయ్ కుమార్, ఈ.రతీశ్, వి.దిలీప్ వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ అయ్యారు.

News November 21, 2025

నరసరావుపేట: రేపు ఎస్సీ, ఎస్టీల కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్

image

ఎస్టీ, ఎస్సీల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నామని కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. శనివారం ఉదయం 10.30 గంటలకు నరసరావుపేట కలెక్టరేట్‌లో ఫిర్యాదుల పరిష్కార వేదిక ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు వినియోగించుకుని తమ సమస్యలను అర్జీల రూపంలో సమర్పించుకోవాలని కోరారు.

News November 21, 2025

BREAKING: వరంగల్: ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ

image

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఇన్‌‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ సీపీ సన్ ప్రీత్ సింగ్ ఈరోజు ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన వారిలో మామూనూర్ ఇన్‌స్పెక్టర్ ఓ.రమేశ్ వీఆర్‌కు బదిలీ కాగా, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ ఈ.శ్రీనివాస్ మామూనూర్‌‌కు బదిలీ అయ్యారు. వీఆర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏ.ప్రవీణ్ ఐటీ కోర్ సెల్‌కు బదిలీ అయ్యారు.