News April 1, 2025
భూకంప జోన్-3లో భద్రాచలం

భూకంపాలు ఏర్పడే జోన్-3 పరిధిలో భద్రాచలం ఉన్నట్లు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ప్రాంతంలో తీవ్రత 0.125గ్రావిటీగా ఉంటుందని తెలిపారు. దీంతో భూకంపాలు స్వల్పంగా వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత 56ఏళ్లలో ఈ ప్రాంతంలో 199సార్లు భూకంపాలు వచ్చాయన్నారు. 1969లో పర్ణశాలలో వచ్చిన భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.5గా నమోదైంది. 2024 DEC 4న కూడా ఇక్కడ భూమి స్వల్పంగా కంపించింది.
Similar News
News April 20, 2025
21 నుంచి హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి: DEO

ఖమ్మం: తెలంగాణ మోడల్ స్కూల్ 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జరిగే ప్రవేశ పరీక్షల కొరకు విద్యార్థులు ఈ నెల 21 నుంచి http://telanganams.cgg.gov.in వెబ్సైట్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని DEO సోమశేఖరశర్మ తెలిపారు. ఈనెల 27న 6వ తరగతి విద్యార్థులకు ఉ.10 గంటల నుంచి మ.12.00 గంటల వరకు, 7వ, 10వ తరగతి విద్యార్థులకు మ.2 గంటల నుంచి సా.4 గంటల వరకు ప్రవేశ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నారు.
News April 20, 2025
నేటి నుంచి పరీక్షలు.. 8 కేంద్రాలు ఏర్పాటు

ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం జిల్లాలో 8 కేంద్రాలను ఏర్పాటు చేయగా 1,553 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఇందులో పదో తరగతి విద్యార్థులు 655మంది, ఇంటర్ అభ్యర్థులు 898మంది ఉన్నారు. నేటి నుంచి 26వ తేదీ వరకు ఉదయం, సాయంత్రం పరీక్షలు జరగనున్నాయి.
News April 19, 2025
సత్తా చాటిన కృష్ణవేణి విద్యార్థులు

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఖమ్మం కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. సంపత్-62, బాలాజీ-119, త్రిపుర-288, మణిచంద్రసాయి-572, నాగరాజు-1082, వెంకట సాయి కృష్ణ -1499తో పాటు మరెంతో మంది జాతీయ స్థాయిలో సత్తా చాటారన్నారు. డైరక్టర్స్ జగదీష్, కోటేశ్వర్ రావు, వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రామచంద్రయ్య, డీన్ వంశీకృష్ణ, AO నిరంజన్ కుమార్ విద్యార్థులను అభినందించారు.