News February 20, 2025

భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

image

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 26, 2026

తిరుపతి జిల్లాలో పరీక్షలకు 454 మంది డుమ్మా

image

తిరుపతి జిల్లాలో గురువారం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా 98 కేంద్రాల్లో 29,470 మంది పరీక్షలు రాయాల్సి ఉంది. 29,016 మంది విద్యార్థులు హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 454 మంది పరీక్షలకు రాలేదని చెప్పారు.

News February 26, 2026

శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

image

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్‌కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.

News February 26, 2026

గద్వాల్ జిల్లా DROగా పద్మజ రాణి

image

జోగులాంబ గద్వాల జిల్లాలో పలువురు ప్రభుత్వ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు DRO గా పద్మజ రాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అదే విధంగా జిల్లాలో ఆర్డీవో బాధ్యతలో ఉన్న ఉన్న అలివేలును హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రస్తుతం హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా విధులను నిర్వహిస్తున్న టి.శ్రీనివాస్ రావును జిల్లా రెవెన్యూ అభివృద్ధి శాఖ అధికారిగా బదిలీ చేశారు.