News February 20, 2025

భూపాలపల్లిలో దారుణ హత్య.. భూ వివాదమే కారణమా?

image

భూపాలపల్లి పట్టణంలోని రెడ్డి కాలనీలో బుధవారం రాత్రి 15వ వార్డు తాజా మాజీ కౌన్సిలర్ సరళ భర్త రాజలింగమూర్తి హత్య కలకలం రేపిన విషయం తెలిసిందే. బుధవారం సాయంత్రం రాజలింగమూర్తి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో నలుగురు వ్యక్తులు విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఈ హత్యకు జిల్లా కేంద్రంలోని ఓ భూవివాదమే కారణమని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News July 4, 2025

నిర్మల్: రాజీవ్ యువ వికాసంపై నీలినీడలు..!

image

యువత స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రాజీవ్ యువ వికాసం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి. దరఖాస్తులు చేసి 3 నెలలు కావస్తున్నా సర్కార్ ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. జూన్ 2న మంజూరు పత్రాలను ఇవ్వాల్సి ఉండగా ఆఖరి క్షణంలో సర్కార్ వెనక్కి తగ్గింది. జిల్లాలో7,214 యూనిట్లు మంజూరు లక్ష్యం ఉండగా 35,177 దరఖాస్తులు వచ్చాయి. త్వరగా ఇవ్వాలని యువత కోరుతున్నారు.

News July 4, 2025

విశాఖ CPT పరీక్ష ఏర్పాట్లపై సమీక్ష

image

ఏపీ పీసీబీలో నియమితులైన గ్రూప్-2, గ్రేడ్-2 ఉద్యోగుల సీపీటీ పరీక్ష శనివారం మూడు సెషన్లలో జరగనున్నది. 186 మంది అభ్యర్థులు గాజువాక ఎస్.ఎస్. సొల్యూషన్స్ కేంద్రంలో జరిగే పరీక్షకు హాజరవుతారు. ఏర్పాట్లను డీఆర్వో భవానీ శంకర్ సమీక్షించారు. అభ్యర్థులు గంట ముందే రాగలరని, ఐడీ కార్డ్ తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధం.

News July 4, 2025

వరంగల్ పోక్సో కోర్టు పీపీగా వెంకటరమణ

image

వరంగల్ జిల్లా పోక్సో కోర్టు నూతన పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణ నియామకమయ్యారు. ఈ మేరకు రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఉత్తర్వులు జారీ చేయగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 2007లో లా పట్టా పొంది, జిల్లా న్యాయస్థానాల్లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తున్న రమణకు ఈ అవకాశం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.