News March 3, 2025
భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్కు చెందిన సతీష్గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 16, 2025
మీకోసం కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోండి: కలెక్టర్

పల్నాడు జిల్లా కలెక్టరేట్లో నవంబర్ 17న సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక యథావిధిగా జరుగుతుందని కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం మీకోసం కాల్ సెంటర్ సేవలను ఉపయోగించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను Meekosam.ap.gov.inలో లేదా 1100 నంబర్కు కాల్ చేసి నమోదు చేసుకోవచ్చని కోరారు.
News November 16, 2025
MDK: పీహెచ్సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

మెదక్ జిల్లా వ్యాప్తంగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా వైద్యాధికారులు పని చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. ఆదివారం ఆయన శంకరంపేట (ఆర్) మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్సీ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పుస్తకాలు, మందుల స్టాక్ బోర్డులను నిశితంగా పరిశీలించారు. వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. సమయపాలన పాటించాలని అధికారులకు ఆదేశించారు.
News November 16, 2025
పంచాయతీ నిధుల వివరాలు తెలుసుకోండిలా!

గ్రామ పంచాయతీలకు వచ్చే నిధులు, ఖర్చులను తెలుసుకోవాలనే కుతూహలం చాలామందికి ఉంటుంది. కానీ ఎవరిని అడగాలో తెలియదు. అయితే ‘e-Gram Swaraj’ <


