News March 3, 2025

భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News October 15, 2025

KNR: నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమం

image

స్థానిక ప్రభుత్వ మహిళా కళాశాలలో ప్రిన్సిపల్ డా.వరలక్ష్మి అధ్యక్షతన భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న నషాముక్త్ భారత్, కుశాల్ భారత్ కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు.‌ ఈ సమావేశంలో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో NSS ప్రోగ్రాం ఆఫీసర్లు డా.మొగిలి, డా.లక్ష్మణరావు, పెద్ది స్వరూప, డా.స్రవంతి, అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

News October 15, 2025

అడ్డగోలు NOCలు.. 55 మంది ఇంజినీర్లపై వేటు

image

HYD పరిధిలో చెరువులు, కుంటలు, కాల్వల పరిధిలో అక్రమ నిర్మాణాలకు అనుమతిస్తూ NOCలు జారీ చేసిన ఇంజినీర్ల(SE, EE, AEE, DEE) భరతం పట్టింది నీటిపారుదల శాఖ. పైరవీలు, పలుకుబడితో ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేసిన 55 మందిని ఇతర జిల్లాలకు పంపుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. బదిలీలపై ప్రస్తుతం నిషేధం అమల్లో ఉండటంతో వర్కింగ్ అరేంజ్‌మెంట్ పేరుతో ఇతర జిల్లాలకు పంపింది. వారి స్థానాల్లో ఇతర జిల్లాల వారిని ODపై తీసుకొచ్చింది.

News October 15, 2025

పెద్దపల్లి డీసీసీ అధ్యక్ష పదవికి ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నామినేషన్

image

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారంతో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా హాజరై మద్దతు తెలిపారు.