News March 3, 2025

భూపాలపల్లిలో యాక్సిడెంట్.. ముగ్గురి మృతి

image

జయశంకర్ భూపాలపల్లి జిల్లా రాంపూర్ క్రాస్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు, ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహాముత్తారం మండలం మీనాజీపేట గ్రామానికి చెందిన పింగిలి రాజిరెడ్డి, లడ్డు, పంబాపూర్‌కు చెందిన సతీష్‌గా ఘటనాస్థలిలోనే మృతిచెందారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News March 4, 2025

రోహిత్ అలా ఆడితే భారీ స్కోరు ఖాయం: మంజ్రేకర్

image

నేడు AUSతో జరిగే సెమీస్‌ మ్యాచ్‌లో రోహిత్ ఎలా ఆడతారన్నదే కీలకమని వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డారు. ‘గిల్, విరాట్, అయ్యర్ వారిదైన శైలిలో ఆడుకుంటూ వెళ్లిపోతారు. కానీ రోహిత్ మాత్రం వీలైనంత ఎక్కువ సేపు క్రీజులో ఉండేందుకు చూడాలి. ప్రత్యర్థి స్పిన్నర్లు వచ్చే సమయానికి ఆయన కుదురుకుంటే భారీ స్కోరు సాధ్యపడుతుంది. ఇది 350 పిచ్ కాదు. దానికి తగ్గట్టుగా తుది స్కోరును ప్లాన్ చేసుకోవాలి’ అని సూచించారు.

News March 4, 2025

పిఠాపురం: 14న జనసేనలోకి పెండెం దొరబాబు?

image

పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కుటుంబ సమేతంగా సోమవారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. దొరబాబును జనసేనలో చేర్చుకునేందుకు పవన్ సముఖంగా ఉన్నారన్న నేపథ్యంలో ఆయన జనసేనలో ఎప్పుడు చేరుతారనేది పిఠాపురంలో హాట్ టాపిక్‌గా మారింది. దొరబాబు అనుచరులతో పెద్ద ఎత్తున పిఠాపురంలో మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలో పార్టీ చేరుతారని సమాచారం. దీనిపై అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

News March 4, 2025

సంగారెడ్డి: 20 రోజుల్లో పెళ్లి.. అంతలోనే

image

మంజీర నదిలో యువకుడి మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. పోలీసుల వివరాలిలా.. నాగల్‌గిద్ద మండలం కరస్ గుత్తికి చెందిన సునీల్ చౌహాన్(23) కొన్ని రోజులుగా పచ్చకామెర్లతో బాధపడుతున్నాడు. శనివారం ఇంటి నుంచి వెళ్లిన సునీల్ తిరిగి రాలేదు. హద్నూర్ పోలీసులు రాఘవపూర్ శివారులో మంజీర నది బ్రిడ్జిపై అతడి బైక్ గుర్తించారు. నదిలో నిన్న సునీల్ మృతదేహం దొరికింది. ఈనెల 26న సునీల్ పెళ్లి జరగాల్సి ఉంది.

error: Content is protected !!