News April 17, 2025
భూపాలపల్లిలో సైబర్ నేరాలపై ఎస్పీ హెచ్చరిక

భూపాలపల్లి జిల్లాలో సైబర్ నేరగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ప్రభుత్వ ఏజెన్సీల పేరిట ప్రజలను భయపెడుతున్నారని ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. లాటరీలు, రివార్డులు, డిస్కౌంట్ల పేరుతో సులభంగా డబ్బు సంపాదించే ఆశ చూపి మోసం చేస్తున్నారని తెలిపారు. OTP ఎవరితోనూ పంచుకోవద్దని, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Similar News
News January 2, 2026
టాప్ స్టోరీస్

* కృష్ణా జలాల అంశంలో KCR, హరీశ్ చేసిన అన్యాయానికి ఉరేసినా తప్పులేదు: CM రేవంత్
* నదీ జలాలపై CMకు కనీస అవగాహన లేదు: KTR
* CMకు బచావత్-బ్రిజేష్ ట్రిబ్యునళ్ల మధ్య తేడా తెలీదు: హరీశ్
* న్యూఇయర్.. AP, TGలో భారీగా పెరిగిన మద్యం విక్రయాలు
* 5 రకాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిన AP ప్రభుత్వం
* 2027 AUG 15న దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్: కేంద్రం
* OP సిందూర్కు రాముడే ఆదర్శం: రాజ్నాథ్
News January 2, 2026
IPL: గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు

IPL మినీ ఆక్షన్లో గ్రీన్ (₹25.20Cr), పతిరణ (₹18Cr) అత్యధిక ధర పలికిన టాప్-2 ఆటగాళ్లుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే గ్రీన్ కంటే పతిరణకే ఎక్కువ డబ్బులు రానున్నాయి. ఓవర్సీస్ ప్లేయర్ల ఫీజు విషయంలో <<18572248>>BCCI పెట్టిన లిమిట్<<>> వల్ల గ్రీన్కు ₹18Cr మాత్రమే దక్కుతాయి. అందులో IND+AUS ట్యాక్సులు పోగా ఆయనకు మిగిలేది ₹9.9కోట్లే. అటు SL బౌలర్ పతిరణకు ట్యాక్సులు తీసేయగా ₹12.9 కోట్లు మిగులుతాయి.
News January 2, 2026
జగిత్యాల: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం: ఎస్పీ

జనవరి 1 నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో రోడ్డు భద్రత పోస్టర్లను ఆవిష్కరించారు. రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు, చౌరస్తాలు, బస్టాండ్లలో కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.


