News January 30, 2025

భూపాలపల్లి: ‘అందరికీ రుణమాఫీ జరగలేదు’

image

MRPS-TS జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు ఎలుకటి రాజయ్య బుధవారం జిల్లా వ్యవసాయ అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. 2 లక్షలకు పైగా రుణం ఉన్న రైతుల రుణాలను త్వరితగతిన మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రకాల రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పిందని, కానీ క్షేత్రస్థాయిలో అందరికీ రుణమాఫీ జరగలేదన్నారు.

Similar News

News February 20, 2025

ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించాలి: కలెక్టర్

image

పాఠశాలల్లోని విద్యార్థులందరి ఆధార్ బయోమెట్రిక్‌ను అప్ డేట్ చేయించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సంబంధిత అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ హాల్‌లో బుధవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఆధార్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగింది. కలెక్టర్ మాట్లాడుతూ..  భవిష్యత్తులో జేఈఈ వంటి పరీక్షలు రాసే సమయంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తవని సూచించారు.

News February 20, 2025

వికారాబాద్: ప్రతి ఒక్కరూ బాలికల విద్యకు ప్రోత్సహించాలి: ట్రైనీ కలెక్టర్

image

బాలికల విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని శిశు సంక్షేమ శాఖ ఇంఛార్జ్ అధికారి ట్రైన్ కలెక్టర్ ఉమా హారతి తెలిపారు. బుధవారం వికారాబాద్ కేజీబీవీ పాఠశాలలో బేటి బచావో బేటి పఢావో కార్యక్రమం 10ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విద్యార్థులకు క్రీడా పోటీలు నిర్వహించారు. ప్రతి ఒక్కరూ బాలికలకు ప్రథమ ప్రాధాన్యం ఇచ్చి వారి విద్యకు, భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలన్నారు. 

News February 20, 2025

ఛాంపియన్స్ ట్రోఫీ ఓడిపోయినా రోహితే కెప్టెన్: కైఫ్

image

‘ఛాంపియన్స్ ట్రోఫీ’ని భారత్ గెలుచుకోలేకపోయినా సరే 2027 వరల్డ్ కప్ వరకూ రోహిత్ శర్మనే భారత కెప్టెన్‌గా కొనసాగించాలని మాజీ క్రికెటర్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ‘రోహిత్ సాధించిన ఘనతలు అందరూ సాధించలేరు. టీమ్ ఇండియాను 2023 వరల్డ్ కప్ ఫైనల్‌కు చేర్చారు. వన్డే ఫార్మాట్లో ఆయన ఆటను, కెప్టెన్సీని ఎవరూ ప్రశ్నించలేరు. అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్‌గా రోహిత్ గెలుపు శాతం అద్భుతం’ అని గుర్తుచేశారు.

error: Content is protected !!