News March 4, 2025

భూపాలపల్లి: ఆ కుటుంబాల్లో విషాదం 

image

నిన్న రాత్రి రాంపూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం <<15642532>>3కుటుంబాల్లో<<>> విషాదం నింపింది. మరణించిన పంబాపూర్ వాసి సతీశ్ భార్యకు ఈనెల 6న డెలివరీ డేట్ ఉంది.ఏడాది వయసు గల పాప కూడా ఉంది. ఇక మరో ఇద్దరు మృతులు మహాముత్తారం మండలం మీనాజీపేట వాసులు రవీందర్ రెడ్డి(42),నరసింహారెడ్డి(33)వరుసకు బంధువులు.నర్సింహకు పదేళ్లలోపు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వరుసగా మృతదేహాలు అంత్యక్రియలకు వెళ్లడం గ్రామస్థులందరినీ కంటతడి పెట్టించింది.

Similar News

News March 24, 2025

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో నేటి పంట ఉత్పత్తుల ధరలు…!

image

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డుకు సోమవారం127 మంది రైతులు తమ పంట ఉత్పత్తులు అమ్మకానికి తీసుకొచ్చారు. వేరుశనగలు 702 క్వింటాళ్లు అమ్మకానికి రాగా క్వింటాలకు గరిష్ఠ ధర రూ.6,740 కనిష్ఠ ధర రూ.4,001 లభించింది. మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠ ధర రూ.2,280, కనిష్ఠ ధర రూ.1767 లభించింది. కందులు గరిష్ఠ ధర రూ.6,771. ఆముదాలకు గరిష్ట ధర రూ.6,319. జొన్నలకు గరిష్ట ధర రూ.4,215 లభించినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు.

News March 24, 2025

నర్సంపేట: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి

image

వరంగల్ జిల్లా నర్సంపేటలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో బీటెక్ చదువుతున్న ఒక విద్యార్థి మృతి చెందాడు. జయముఖి కాలేజీలో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్న దారం వికాస్(22), మరో విద్యార్థి రాజు బైక్‌పై పాకాల నుంచి నర్సంపేటకు వస్తున్నారు. రాజుపేట శివారులో ద్విచక్ర వాహనం అదుపుతప్పడంతో ఇద్దరూ కిందపడ్డారు. ఈ ఘటనలో వికాస్ అక్కడికక్కడే మృతిచెందగా.. రాజుకు తీవ్ర గాయాలు అయ్యాయి.

News March 24, 2025

రాత్రి భోజనం తర్వాత ఇలా చేయండి!

image

కొన్ని అలవాట్లు రాత్రి తిన్న తర్వాత జీర్ణక్రియను వేగవంతం చేయడంలో సహాయపడతాయని వైద్యులు చెబుతున్నారు. ‘తిన్న తర్వాత ఓ 10 ని.లు నడిస్తే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. గోరు వెచ్చని నీళ్లు తాగితే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. తిన్న తర్వాత ఓ 30 ని.లు పడుకోకుండా ఉంటే ఎసిడిటీ, గ్యాస్ సమస్యలు ఉండవు. సోంపు లేదా వాము నమిలితే బాగా జీర్ణమై మలబద్ధకం తగ్గుతుంది. కొద్దిసేపు నిటారుగా కూర్చున్నా మంచిదే’ అని తెలిపారు.

error: Content is protected !!