News March 5, 2025

భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

image

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.

Similar News

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

అగ్ర హీరోల నటగురువు కన్నుమూత

image

చెన్నై ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ మాజీ డైరెక్టర్ కేఎస్ నారాయణస్వామి(92) కన్నుమూశారు. ఆయన మృతదేహానికి రజినీకాంత్ నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. సినీ వర్గాల్లో నారాయణస్వామి.. కేఎస్ గోపాలిగా సుపరిచితం. రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, నాజర్, రాధా రవి వంటి ప్రముఖులకు నటనలో ఆయన పాఠాలు చెప్పారు. రజినీని డైరెక్టర్‌ బాలచందర్‌కు పరిచయం చేసింది కూడా ఈయనే.

News November 18, 2025

HYD: ‘సామాజిక, ఆర్థిక అణిచివేతలతో నక్సలిజం వైపు’

image

సామాజిక, ఆర్థిక అణచివేతలతో యువత నక్సలిజం వైపు వెళ్తున్నారని కాంగ్రెస్ నేత మధుయాష్కిగౌడ్ అన్నారు. ఆదివాసి గిరిజన ప్రాంతాలు అభివృద్ధి చెందినప్పుడే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సోమవారం జరిపిన ఆదివాసి గిరిజన యువత ఇంట్రాక్షన్(వాలిడిక్టరీ)లో మాట్లాడారు. సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారికి గవర్నర్, మధుయాష్కీ బహుమతులు అందజేశారు. వనరులున్నా సదుపాయాలు, సంపద లేదన్నారు.