News March 5, 2025

భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

image

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.

Similar News

News November 6, 2025

HYD: 108వ భారత ఆర్థిక సంఘం బ్రోచర్ విడుదల

image

108వ భారత ఆర్థిక సంఘం వార్షిక సదస్సు బ్రోచర్‌ను ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలనా భవనంలోని EC గదిలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం విడుదల చేశారు. ఈ సదస్సు డిసెంబర్ 21 నుంచి 23 వరకు నిర్వహించనున్నారు. ఆర్థిక శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు భారత ఆర్థికవ్యవస్థను ప్రభావితం చేస్తున్న కీలక అంశాలపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ విద్యావేత్తలు, విధాన నిర్వాహకులు, పరిశోధకులను ఒకే వేదికపై తీసుకురానుంది.

News November 6, 2025

HYD:”ఓయూలో ఓరియంటేషన్ ప్రోగ్రాం”

image

ఓయూ టెక్నాలజీ కళాశాలలో బీ ఫార్మసీ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ మొలుగరం కుమార్ హాజరై మాట్లాడారు. 108 ఏళ్ల చారిత్రక ప్రయాణంలో ఓయూ విద్యారంగంలో సమాజ నిర్మాణంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించిందన్నారు. విద్యార్థులకు విశ్వస్థాయి విద్యను అందించాలన్నదే లక్ష్యమన్నారు. బీఫార్మసీకి చాలా మంచి డిమాండ్ ఉందన్నారు.

News November 6, 2025

HYD: 50 మందికి జాయినింగ్ పత్రాలు అందజేత

image

ప్రతి ఆర్టీసీ సిబ్బంది భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆర్టీసీ మల్టీ సర్వీస్ ఆథరైజేషన్ ఇన్‌ఛార్జి ఎండీ వడ్లూరి రాజశేఖర్ అన్నారు. నాచారంలో కొత్తగా ఎంపికైన ఆర్టీసీ కండక్టర్లకు 50 మందికి జాయినింగ్ పత్రాలు అందజేశారు. అనంతరం ఎండీ రాజశేఖర్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అన్ని సౌకర్యాలు కల్పిస్తూ కండక్టర్లకు ఎల్లప్పుడూ అండగా ఉంటామన్నారు. నూతన కండక్టర్లు పాల్గొన్నారు.