News March 5, 2025

భూపాలపల్లి: ఇంటర్ విద్యార్థులకు ఎస్పీ సూచనలు

image

నేడు ఇంటర్ పరీక్షకి హాజరయ్యే అభ్యర్థులు హాల్ టికెట్‌లో పొందుపరిచిన విధంగా సమయానికి చేరుకోవాలని భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు తమవెంట పరీక్షా హాల్‌లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్, పెన్ డ్రైవ్, బ్లూటూత్, ఎలక్ట్రానిక్ వాచ్, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటివి తీసుకెళ్లడానికి అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి వెళ్లేముందే పోలీసులు గేటు వద్ద తనిఖీలు నిర్వహిస్తారన్నారు.

Similar News

News February 24, 2026

సంతానలేమికి ముందే హెచ్చరికలు

image

సంతానలేమితో బాధపడే మహిళల్లో రజస్వల నాటి నుంచే కొన్ని హెచ్చరిక సంకేతాలు కనిపిస్తుంటాయంటున్నారు నిపుణులు. నెలసరి సక్రమంగా రాకపోవడం, ఎక్కువరోజులు బ్లీడింగ్ కావడం, కొందరు 18 ఏళ్లు వచ్చినా అసలు రజస్వలే కాకపోవడం వంటివి గమనించాలి. ఊబకాయం, అవాంఛిత రోమాలు మొలవటం, విడవకుండా మొటిమలు వేధించటం, తీవ్రమైన కడుపునొప్పి వంటివీ ఉండొచ్చు. వీటిని రక్త పరీక్షలు, స్కానింగ్‌తో గుర్తించొచ్చు.

News February 24, 2026

₹130 కోట్ల రివార్డున్న క్రిమినల్ హతం.. ప్రియురాలే కారణం!

image

మెక్సికోలో రూ.130 కోట్ల రివార్డు ఉన్న డ్రగ్ కార్టెల్ బాస్ ‘ఎల్ మెంచో’ <<19213322>>హతమవడానికి<<>> పరోక్షంగా అతని ప్రియురాలు కారణమయ్యారు. ఆమెను కొన్నిరోజులుగా ట్రాక్ చేసి అతని జాడను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ‘మరుసటి రోజే డ్రగ్ డాన్ స్థావరాన్ని చుట్టుముట్టి కాల్పులు జరపడంతో అతను అడవిలోకి పారిపోయాడు. వెంటాడి అటాక్ చేయడంతో ఎల్ మెంచో, అనుచరులు గాయపడ్డారు. ఆస్పత్రికి తీసుకెళ్లేలోపు చనిపోయారు’ అని వెల్లడించారు.

News February 24, 2026

గుంటూరు ఛానల్ వంతెన నిర్మాణానికి నిధులు

image

గుంటూరు ఛానల్‌పై వంతెన పునర్నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. ఛానల్‌లోని 33.300 కి.మీ వద్ద సింగిల్ లేన్ వంతెన నిర్మించనున్నారు. దీని కోసం రూ.94.88 లక్షలు కేటాయిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జలవనరుల శాఖ ఈ మేరకు జీవో-92 విడుదల చేసింది. తగిన సాంకేతిక అనుమతులు తీసుకుని, నిబంధనల ప్రకారం పనులు ప్రారంభించాలని కృష్ణా డెల్టా చీఫ్ ఇంజినీర్‌ను ప్రభుత్వం ఆదేశించింది.