News March 19, 2025
భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధిపై పలు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందన్నారు.
Similar News
News October 19, 2025
ఒకే అభ్యర్థి రెండు పార్టీల తరఫున నామినేషన్.. ఎందుకంటే?

ఒకే అభ్యర్థి 2, 3 స్థానాల్లో పోటీ చేయడం కామన్. కానీ ఒకే చోట 2 పార్టీల తరఫున పోటీ చేయడం చూశారా? బిహార్లోని ఆలమనగర్లో నబిన్ కుమార్ అనే అభ్యర్థి ముందుగా RJD తరఫున నామినేషన్ దాఖలు చేశారు. సీట్ల సర్దుబాటులో మహా కూటమి స్థానిక పార్టీ VIPకి కేటాయించింది. విషయం తెలిసి వీఐపీ నుంచి నామినేషన్ చేశారు. 2 పార్టీల తరఫున పోటీలో ఉన్నారనే ఫొటోలు వైరలవ్వడంతో RJD నుంచి నామినేషన్ వెనక్కి తీసుకున్నారు.
News October 19, 2025
కేసీఆర్ తపనతో టెక్స్టైల్ పార్కుకు అంకురార్పణ: KTR

స్వరాష్ట్రంలో ఓరుగల్లుకు పూర్వవైభవం తేవాలని, మన బిడ్డలకు కొలువులు దొరకాలనే కేసీఆర్ తపనతో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు అంకురార్పణ జరిగిందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ట్వీట్ చేశారు. వేల మంది స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ ప్రస్తుతం గణేశా, గణేశా ఎకోస్ఫియర్, యంగ్వన్, కిటెక్స్ సంస్థలు తమ తమ యూనిట్లను మొదలుపెట్టాయని, తెలంగాణ ఉజ్వల ప్రగతికి సజీవ తార్కాణం టెక్స్టైల్ పార్క్ అని అన్నారు.
News October 19, 2025
జనగామ: ఈ-కేవైసీ తప్పనిసరిగా చేసుకోవాలి: డీఆర్డీవో

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జాబ్ కార్డులు ఉన్న కార్మికులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేసుకోవాలని డీఆర్డీవో వసంత సూచించారు. ఈనెలాఖరు వరకు మాత్రమే గడువు ఉన్నందున జాబ్ కార్డుదారులు స్థానిక ఫీల్డ్ అసిస్టెంట్ను సంప్రదించి ఈకేవైసీ చేసుకోవాలని ఆమె కోరారు.