News March 19, 2025

భూపాలపల్లి: కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి: వైద్యాధికారి 

image

కుష్టు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలని జిల్లా వైద్యాధికారి డా.మధుసూదన్ పిలుపునిచ్చారు. మంగళవారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో కుష్టి వ్యాధిపై పలు సూచనలు చేశారు. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈనెల 17 నుంచి 30 వరకు జిల్లా వ్యాప్తంగా నిర్వహించే సర్వేకు సహకరించాలని కోరారు. వ్యాధిగ్రస్థులకు ప్రభుత్వం రూ.12 వేల చొప్పున అందిస్తుందన్నారు.

Similar News

News February 25, 2026

సిద్దిపేట: న్యూసెన్స్ చేసిన వ్యక్తికి ఐదు రోజుల జైలు శిక్ష

image

బహిరంగ ప్రదేశంలో న్యూసెన్స్ చేసిన వ్యక్తికి సిద్దిపేట కోర్టు ఐదు రోజుల జైలు శిక్ష విధించింది. ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన శంకర్ మద్యం సేవించి వాహనం నడుపుతూ ప్రజలకు అసౌకర్యం కలిగించాడు. పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ, అసభ్య పదజాలంతో దూషించడంతో కేసు నమోదు చేశారు. ఈ మేరకు కోర్టు నిందితుడికి జైలు శిక్ష విధించింది.

News February 25, 2026

రేపు కోదాడకు కేటీఆర్ రాక!

image

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం కోదాడకు వస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తెలిపారు. ఇటీవల పోలీస్ లాకప్ డెత్‌లో మృతి చెందిన కర్ల రాజేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు మధ్యాహ్నం 2 గంటలకు ఆయన రానున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మల్లయ్య యాదవ్ పిలుపునిచ్చారు.

News February 25, 2026

ADB: ఉమ్మడి జిల్లాలో 15 వేల పాసుపుస్తకాలు పెండింగ్‌

image

6 నెలలుగా పట్టా పాసుబుక్కులు జారీ కాకపోవడంతో రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఉమ్మడి ADBజిల్లాల్లో రోజుకు 75-100 రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. డిజిటల్ సిగ్నేచర్ తర్వాత ప్రింటింగ్ ఏజెన్సీ ఇంటి వద్దకే పాసుపుస్తకాలు పంపాలి. ఏజెన్సీకి ప్రభుత్వం డబ్బులు చెల్లించకపోవడంతో ప్రింటింగ్ నిలిపివేసింది. ప్రభుత్వం ఈబాధ్యతలను మరో ఏజెన్సీకి అప్పగించింది. ఉమ్మడిజిల్లాలో దాదాపు 15వేల పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉన్నాయి.