News March 31, 2025
భూపాలపల్లి: ‘కొలువుల ధీరుడు’కి 10వ ప్రభుత్వ ఉద్యోగం

చిట్యాల మండలం గుంటూరుపల్లి గ్రామానికి చెందిన వెల్ది గోపికృష్ణ టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూపు-1 ఫలితాల్లో 493.5 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో 70వ ర్యాంకర్గా నిలిచారు. కేంద్ర ప్రభుత్వంలో 07, రాష్ట్ర ప్రభుత్వంలో 3వ ప్రభుత్వ ఉద్యోగం సాధించాడు. ప్రస్తుతం గోపికృష్ణ ఖమ్మం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా ఇటీవల ఆర్డర్ కాపీ తీసుకొని తెలంగాణ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పొందుతున్నాడు.
Similar News
News November 26, 2025
NRPT: ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: ఈసీ

గ్రామ పంచాయతీ ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో నారాయణపేట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ డాక్టర్ వినీత్ పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని, జిల్లాలో నామినేషన్ల స్వీకరణకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కమిషనర్ సూచించారు.
News November 26, 2025
MDK: పంచాయతీ ఎన్నికలు.. అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు

ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో జీపీ ఎన్నికల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అర్ధబలం, ప్రజల్లో పేరు ప్రతిష్టలు వున్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. పార్టీ గుర్తులు లేకుండా జరిగే ఎన్నికలు అయినప్పటికీ పల్లెల్లో పట్టు నిలుపుకోవడానికి పంచాయతీ పాలకవర్గం కీలకం. MDKలో 492, SRDలో 613, SDPTలో 508 జీపీలు ఉన్నాయి.
News November 26, 2025
సిద్దిపేట: రేపు దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలు

రేపు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఉద్దేశించి దివ్యాంగులకు జిల్లా స్థాయి ఆటల పోటీలను నిర్వహిస్తున్నామని జిల్లా సంక్షేమ శాఖ అధికారి శారద తెలిపారు. ఈ ఆటల పోటీలను డిగ్రీ కళాశాల పక్కన ఉన్న క్రీడా స్టేడియంలో జరుపబడతాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొనే దివ్యాంగులు సదరం, ఆధార్ కార్డు తీసుకొని రావాలన్నారు. గెలుపొందిన మొదటి విజేతలను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు పేర్కొన్నారు.


