News February 26, 2025
భూపాలపల్లి: క్వింటాల్కు రూ.25 వేలు మద్దతు ధర కల్పించాలి: గండ్ర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారని, క్వింటాల్కు రూ.25 వేల వరకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేక మొగుళ్లపల్లి మండలంలో రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేయాలన్నారు.
Similar News
News December 7, 2025
SVUలో అధిక ఫీజులు.. అయినా.!

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో MBA, MCA, PG సెమిస్టర్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతర యూనివర్సిటీల్లో రూ.1500లోపు సెమిస్టర్ ఫీజులు ఉండగా.. SVUలో మాత్రం రూ.4వేల వరకు ఉందట. ఇంత ఫీజులు కడుతున్నా సరైన సమయంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు విడుదల చేయడం లేదంటూ విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
News December 7, 2025
శ్రీకృష్ణుని విగ్రహంతో యువతి వివాహం

శ్రీకృష్ణుని మీద భక్తితో ఓ యువతి ఆయన విగ్రహాన్ని వివాహం చేసుకుంది. యూపీలోని బదాయు(D) బ్యోర్ కాశీమాబాద్కు చెందిన పింకీ శర్మ(28) కృష్ణుడిని తన జీవిత భాగస్వామిగా ఎంచుకుంది. పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థిని అయిన ఆమె వివాహాన్ని కుటుంబ సభ్యులు, గ్రామస్థులు దగ్గరుండి జరిపించారు. పింకీ శ్రీకృష్ణుని విగ్రహాన్ని పట్టుకుని ఏడడుగులు వేసింది. కాగా ఇలాంటి ఘటనలు నార్త్ ఇండియాలో గతంలోనూ జరిగిన సంగతి తెలిసిందే.
News December 7, 2025
SRPT: పోస్టల్ బ్యాలెట్ విధిగా వినియోగించుకోవాలి: కలెక్టర్

తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల విధులు నిర్వర్తించే ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ను విధిగా వినియోగించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ ఆదేశించారు. ఎన్నికల సంఘం కల్పించిన ఈ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆయన కోరారు. ఆత్మకూరు (ఎస్), సూర్యాపేట సహా 8 మండలాల ఉద్యోగులు ఈ నెల 6 నుంచి 9వ తేదీలలో ఫెసిలిటేషన్ కేంద్రాల్లో ఓటు వేయాలని స్పష్టం చేశారు.


