News February 26, 2025
భూపాలపల్లి: క్వింటాల్కు రూ.25 వేలు మద్దతు ధర కల్పించాలి: గండ్ర

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారని, క్వింటాల్కు రూ.25 వేల వరకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేక మొగుళ్లపల్లి మండలంలో రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేయాలన్నారు.
Similar News
News February 25, 2026
శ్రీకాకుళంలో డయేరియా.. అధికారుల ప్రత్యామ్నాయం

శ్రీకాకుళం నగరంలో డయేరియా ప్రబలడంతో ప్రభావిత ప్రాంతాల్లో తాగునీటి సరఫరా నిలిపివేశారు. పైప్ లైన్లో డ్రైనేజ్ నీరు చేరటం వల్ల నీరు కలుషితమైందన్న అనుమానం వ్యక్తమవుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్. కూర్మారావు తెలిపారు. మరో పక్క కుళాయిల ద్వారా సరఫరా చేసిన తగునీటిని విశాఖపట్నానికి పరీక్షల నిమిత్తం పంపారు.
News February 25, 2026
విశాఖ: ఆత్మహత్య చేసుకున్న యూట్యూబర్ కోమలి

విశాఖకు చెందిని యూట్యూబర్ కోమలి HYDలోని రాయదుర్గం PS పరిధిలో ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల వివరాలిలా.. సోమవారం మణికొండ చిత్రపురికాలనీలో తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. కోమలి 3ఏళ్లుగా మరో యూట్యూబర్ అఖిల్రెడ్డితో ప్రేమలో ఉండగా, వారిద్దరూ విభేదాలతో గతేడాది విడిపోయారు. గతంలోనూ కోమలి ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 25, 2026
చిత్తూరు: విద్యార్థినితో టీచర్ అసభ్య ప్రవర్తన!

చిత్తూరు జిల్లాలో ఓ టీచర్పై కేసు నమోదైంది. పులిచెర్ల మండలం కల్లూరు ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్టర్ టీచర్గా వెంకటేశ్ పనిచేస్తున్నారు. ఓ విద్యార్థిని పట్ల అతను అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ బాలిక ఆత్మహత్యకు ప్రయత్నించగా తిరుపతిలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అతనిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.


