News February 26, 2025

భూపాలపల్లి: క్వింటాల్‌కు రూ.25 వేలు మద్దతు ధర కల్పించాలి: గండ్ర

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పర్యటించిన విషయం తెలిసిందే. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మద్దతు ధర లేక రైతులు సతమతమవుతున్నారని, క్వింటాల్‌కు రూ.25 వేల వరకు మద్దతు ధర కల్పించాలని ప్రభుత్వాలని ఆయన డిమాండ్ చేశారు. మద్దతు ధరలు లేక మొగుళ్లపల్లి మండలంలో రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. న్యాయం చేయాలన్నారు. 

Similar News

News October 29, 2025

NRPT: మాతృ మరణాలు తగ్గించాలంటూ కలెక్టర్ ఆదేశాలు

image

జిల్లాలో మాతృ మరణాలను తగ్గించేందుకు తగిన ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. జిల్లా పరిధిలో నమోదైన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించిన ఆమె, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, వైద్యులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గర్భిణీలకు సమయానికి ఆరోగ్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి కేసును జాగ్రత్తగా పరిశీలించి నివేదికలు సమర్పించాలన్నారు.

News October 29, 2025

NRPT: రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోండి

image

నారాయణపేట జిల్లాలోని 2 జిన్నింగ్ మిల్లులలో అనగా 1 భాగ్యలక్ష్మి జిన్నింగ్ మిల్ లింగంపల్లి, 2 విజయ కాటన్ జిన్నింగ్ మిల్ తిప్రాస్ పల్లి తేదీ 30 నుంచి 31 వరకు సీసీఐ వారికీ పత్తి అమ్ముటకు స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్ క్యాన్సల్ చేసుకోవాలని మార్కెట్ అధికారులు కాన్సిల్ చేసుకోవాలని కోరారు. వర్షాలు కురుస్తున్నాయని సీసీఐ వారు కొనుగోలు చేయడం లేదన్నారు.

News October 29, 2025

ఆవు పాల అభిషేకంతో కష్టాల నుంచి విముక్తి

image

కార్తీక మాసంలో శివారాధన గొప్ప ఫలితాలనిస్తుందని మనకు తెలిసిందే. అందుకే చాలామంది శివాలయాలకు వెళ్లి శివలింగాలకు అభిషేకాలు చేస్తుంటారు. అయితే శివుడికి ఆవు పాలతో అభిషేకం చేయడం అత్యంత పవిత్రమని పండితులు సూచిస్తున్నారు. ఈ అభిషేకం ద్వారా కష్టాలు తొలగిపోతాయని అంటున్నారు. ‘గోమాత పాలు శుభాలకు, పవిత్రతకు చిహ్నం. ఈ అభిషేకం వల్ల శివుడు సంతృప్తి చెంది, జీవితంలో సుఖశాంతులు నెలకొనేలా ఆశీర్వదిస్తాడు’ అంటున్నారు.