News April 13, 2025
భూపాలపల్లి: గొడ్డలితో దారుణహత్య

భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ఆదివారం పేట గ్రామంలో శనివారం అర్ధరాత్రి దారుణమైన హత్య జరిగింది. ఒంటరిగా ఉంటున్న ఒలేటి మల్లమ్మ(70) వృద్ధురాలిని గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో నరికి చంపాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Similar News
News April 22, 2025
వరంగల్ చపాటా అంటే నర్సంపేటనే..!

చపాటా మిర్చి పంట సాగుకు ఉమ్మడి వరంగల్ జిల్లా పెట్టింది పేరు. కానీ ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా సాగయ్యేది నర్సంపేట నియోజకవర్గంలో మాత్రమే. విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న ఈ చపాటా మిర్చిని మొదట నల్లబెల్లికి చెందిన రైతులు సాగు చేశారు. తర్వాత నల్లబెల్లి, నర్సంపేట, దుగ్గొండి, చెన్నారావుపేట, నెక్కొండ తదితర మండలాల్లోని రైతులు ఈ రకం మిర్చి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఇటీవల ఈ మిర్చికి భౌగోళిక గుర్తింపు వచ్చింది.
News April 22, 2025
TML: మే 1, 2న వాచీల ఈ-వేలం

తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాల్లో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను మే 1, 2వ తేదీల్లో ఈ-వేలం వేయనున్నారు. టైటాన్, సిటిజన్, సొనాట, రాగా, టైమ్స్, టైమెక్స్, ఇతర కంపెనీల స్మార్ట్ వాచీలున్నాయి. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని(వేలం) 0877-2264429 నంబరులో సంప్రదించాలి. రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా వేలం జరుగుతంది.
News April 22, 2025
కామారెడ్డి: 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్ష

ఈ నెల 27న ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అచ్చంపేట్ ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ కార్తీక సంధ్య తెలిపారు. సోమవారం ఆమె మాట్లాడుతూ 6వ తరగతి పరీక్ష ఉదయం 10 నుంచి 12 వరకు, 7, 8, 9, 10 తరగతుల పరీక్ష మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని చెప్పారు. హాల్ టికెట్లను telanagana.cgg.gov.in వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.