News March 31, 2025

భూపాలపల్లి: గ్రామాల్లో జోరుగా పైరవీలు..?

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలనలో ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. కానీ, ప్రభుత్వం ఇప్పటివరకు లబ్ధిదారుల లిస్ట్‌ను ఫైనల్ చేయలేదు.కాగా నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరైన విషయం తెలిసిందే. దీంతో జిల్లాలోని అధికార పార్టీకి చెందిన చోటామోటా నాయకులు ఇళ్లు ఇప్పిస్తామని పైరవీలు సాగిస్తున్నట్లు సమాచారం. అసలైన అర్హులు తమకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందో, రాదో అని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News April 19, 2025

జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో SR ప్రభంజనం

image

SR విద్యాసంస్థల విద్యార్థులు జేఈఈ మెయిన్-2025 ఫలితాల్లో జాతీయస్థాయిలో సత్తా చాటారని సంస్థ యాజమాన్యం తెలిపింది. జాతీయ స్థాయిలో నాగసిద్దార్థ-5, పాటిల్ సాక్షి-48, అరుణ్-60, రవిచరణ్ రెడ్డి-65, భరణి శంకర్-88, సురేష్-98 ర్యాంకులతో సత్తా చాటారని తెలిపారు. 3,556 మంది విద్యార్థులు అడ్వాన్స్డ్‌కు అర్హత సాధించారని, వారందరినీ ఛైర్మన్ వరదారెడ్డి, డైరెక్టర్లు మధుకర్ రెడ్డి, సంతోష్ రెడ్డి అభినందించారు.

News April 19, 2025

సత్తా చాటిన కృష్ణవేణి విద్యార్థులు

image

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఖమ్మం కృష్ణవేణి విద్యాసంస్థల విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. సంపత్-62, బాలాజీ-119, త్రిపుర-288, మణిచంద్రసాయి-572, నాగరాజు-1082, వెంకట సాయి కృష్ణ -1499తో పాటు మరెంతో మంది జాతీయ స్థాయిలో సత్తా చాటారన్నారు. డైరక్టర్స్ జగదీష్, కోటేశ్వర్ రావు, వెంకటేశ్వరరావు, ప్రిన్సిపల్ రామచంద్రయ్య, డీన్ వంశీకృష్ణ, AO నిరంజన్ కుమార్ విద్యార్థులను అభినందించారు.

News April 19, 2025

ఖమ్మం శ్రీచైతన్య విజయకేతనం

image

జేఈఈ మెయిన్స్-2025 ఫలితాలలో ఖమ్మం శ్రీచైతన్య విద్యాసంస్థల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారని యాజమాన్యం తెలిపింది. 100లోపు, 1000లోపు ఆల్ ఇండియా ర్యాంకులను సాధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచారన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఛైర్మన్ శ్రీధర్, డైరెక్టర్ శ్రీ విద్య అభినందించారు.

error: Content is protected !!