News March 5, 2025

భూపాలపల్లి జిల్లాలో మండుతున్న ఎండ!

image

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లేవారు, ఇతర పనులకు వెళ్లే జిల్లా ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రధానంగా నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఈరోజు జిల్లా వ్యాప్తంగా 33 నుంచి 36 డిగ్రీలు, రేపు 33 నుంచి 36 డిగ్రీ సెల్సియస్‌ల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి.

Similar News

News November 2, 2025

ఈ రోజు నమాజ్ వేళలు (నవంబర్ 02, ఆదివారం)

image

✒ ఫజర్: తెల్లవారుజామున 5.01 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.15 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.00 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.08 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.44 గంటలకు
✒ ఇష: రాత్రి 6.58 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News November 2, 2025

KMR: ‘తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు’

image

పల్వంచ మండలం ఫరీద్ పేట గ్రామానికి చెందిన మహిళా అత్యాచార ఘటన నిందితుడిని అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన ASP చైతన్య రెడ్డి, రురల్ CI రామన్‌లను ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అభినందించారు. శనివారం జిల్లాలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్‌లో ఆయన వారిని శాలువాతో సత్కరించారు. తప్పు చేసిన వారెవరు చట్టం పరిధిలో నుంచి తప్పించుకోలేరన్నారు. బాధితులకు పోలీసులే రక్షణగా మారాలన్నారు.

News November 2, 2025

ప్రైవేట్ ఆలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి: కలెక్టర్

image

విజయనగరం జిల్లాలోని అన్ని ప్రైవేట్ దేవాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎస్.రాంసుందర్ రెడ్డి శనివారం ఆదేశించారు. కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై విచారం వ్యక్తం చేసిన ఆయన భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. పండుగలు, జాతరల సమయంలో భద్రతా చర్యలు, బారికేడ్లు, క్యూలైన్ వ్యవస్థలు అమలు చేయాలన్నారు. నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు.