News March 21, 2025

భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

image

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News March 23, 2025

అల్లూరి జిల్లాలో చికెన్ ధర ఎంతంటే..

image

అల్లూరి రాజవొమ్మంగి పరిసర గ్రామాల్లో ఆదివారం స్కిన్‌లెస్ బ్రాయిలర్ చికెన్ కిలో రూ. 260కి, స్కిన్‌తో రూ. 240కి విక్రయించారు. గత వారం కంటే కిలో కి రూ. 20 పెరిగిందని వ్యాపారులు తెలిపారు. పాడేరు, చింతపల్లి, కొయ్యూరు, చింతూరు ఏరియాల్లో దాదాపు ఇదే రేటు పలికింది. వచ్చే రోజుల్లో ఈ రేటు మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈ ప్రాంతంలో ఆదివారం 10 టన్నుల వరకు చికెన్ అమ్ముడు అవుతుందని తెలిపారు.

News March 23, 2025

KCRకు దొంగ నోట్లు ముద్రించే ప్రెస్: బండి సంజయ్

image

TG: మాజీ సీఎం కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నకిలీ నోట్లనే ఓటర్లకు పంచారన్నారు. ప్రస్తుతం భూములు అమ్మితే గానీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. అలాగే రాష్ట్రంలో ప్రతి పనికీ కమీషన్ల వ్యవహారం నడుస్తోందని విమర్శించారు.

News March 23, 2025

IPL: మ్యాచ్‌లకు వరుణుడు కరుణించేనా?

image

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో SRH, RR మధ్య మ్యాచ్ జరుగుతోంది. కాగా మరికాసేపట్లో హైదరాబాద్‌తోపాటు రంగారెడ్డి జిల్లాలో కూడా వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణశాఖ అంచనా వేసింది. మరోవైపు నగరంపై ఇప్పటికే మబ్బులు పట్టి ఉన్నాయి. దీంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రాత్రి 7.30 గంటలకు చెన్నైలో జరిగే CSK, MI మ్యాచుకూ వరుణుడి ముప్పు ఉన్నట్లు సమాచారం.

error: Content is protected !!