News March 21, 2025

భూపాలపల్లి జిల్లాలో 3,441 మంది విద్యార్థులు హాజరు

image

భూపాలపల్లి జిల్లాలోని 20 పరీక్షా కేంద్రాల్లో శుక్రవారం ప్రారంభమైన 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి యం.రాజేందర్ తెలియజేశారు. 3,449 విద్యార్థులకు 3,441 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. పరీక్ష కేంద్రాలలో వైద్యం, కరెంటు, రవాణా సౌకర్యాలు తదితర మౌలిక వసతులు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News October 17, 2025

యాదాద్రి భువనగిరి ట్రెసా నూతన కార్యవర్గం ఏకగ్రీవం

image

తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎం. కృష్ణ, ప్రధాన కార్యదర్శిగా ఆర్. శ్రీకాంత్, కోశాధికారిగా జానయ్య, అసోసియేట్ అధ్యక్షుడిగా ఎండీ లాయక్ అలీ ఎన్నికయ్యారు. బొమ్మలరామారం సీనియర్ అసిస్టెంట్ సిహెచ్ శోభతో పాటు మరో 19 మంది కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు.

News October 17, 2025

మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్‌పై కసరత్తు

image

AP: మైనింగ్ లీజుల్లో వడ్డెర్లకు 15% రిజర్వేషన్ అమలుకు ప్రభుత్వం సంకల్పించింది. దీనిపై క్యాబినెట్లో చర్చించేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని మైనింగ్‌పై సమీక్షలో CM CBN అధికారులను ఆదేశించారు. సీనరేజి, ప్రీమియం మొత్తాల్లో వారికి 50% రాయితీ ఇవ్వాలని సూచించారు. తవ్వకాలపై శాటిలైట్ చిత్రాలతో అంచనా వేయాలని చెప్పారు. ఒడిశా మాదిరి వాల్యూ ఎడిషన్ చేస్తే మైనింగ్ ద్వారా ₹30వేల కోట్ల ఆదాయం వస్తుందని సూచించారు.

News October 17, 2025

కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి: అదనపు కలెక్టర్

image

2025-26 ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్ అన్నారు. శుక్రవారం ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో రాజస్వ మండలాధికారి లోకేశ్వర్ రావుతో కలిసి సమావేశం నిర్వహించారు. వరి కొనుగోలు ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. జిల్లాలో 44 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందన్నారు.