News February 14, 2025

భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్

image

భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్(ఎన్.యూ.జే.ఐ) నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ పావుశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా అధ్యక్షుడిగా ఎడ్ల సంతోష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా దొమ్మటి రవీందర్, జిల్లా ఉపాధ్యక్షుడిగా బండారి రాజు, గట్టు రవీందర్, అరిగేలా జనార్దన్, పూర్తి కమిటీని ఎన్నుకున్నారు.

Similar News

News October 22, 2025

భూపాలపల్లి, ములుగు జిల్లాల మద్యం షాపులకు రేపు ఆఖరు!

image

భూపాలపల్లి, ములుగు జిల్లాల మద్యం షాపులకు రేపు ఆఖరి రోజు. ఇప్పటి వరకు రెండు జిల్లాలకు 1,672 దరఖాస్తురాగా, చివరి రోజు పెరిగే అవకాశం ఉంది. 59 మద్యం షాపులకు ఒక్కో దరఖాస్తుదారుడు రూ.3 లక్షల చెల్లించి దరఖాస్తు చేసుకుంటున్నారు. అంతేకాక, రేపు టెండర్లకు చివరి రోజు కానుంది. దీంతో మద్యం దుకాణాలకు భారీగా వ్యాపారులు దరఖాస్తు చేసుకోనున్నారు. గతేడాది ప్రభుత్వానికి రూ.43.22 కోట్లు ఆదాయం వచ్చింది.

News October 22, 2025

నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

image

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును‌ పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 22, 2025

కుమార్తె పై అత్యాచారయత్నం.. ఐదేళ్ల జైలు: SP

image

బొబ్బిలిలోని ఓ కోలనీలో 11 ఏళ్ల కుమార్తెపై అత్యాచారయత్నానికి పాల్పడిన నరసింగరావు (42)కి ఐదేళ్ల ఏళ్ల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానాను పోక్సో కోర్టు విధించిందని ఎస్పీ దామోదర్ తెలిపారు. బాధితురాలికి రూ.50 వేల పరిహారం మంజూరు చేసిందన్నారు. జూలైలో నమోదైన కేసును సమర్థవంతంగా దర్యాప్తు చేసిన సీఐ సతీష్‌ కుమార్, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.