News March 28, 2025
భూపాలపల్లి: నెట్వర్క్ లేక యువత ఆగ్రహం

భూపాలపల్లి జిల్లాలో రాజీవ్ యువ వికాసం దరఖాస్తు దారులకు నెట్ వర్క్ సమస్యలు తప్పడం లేదు. జిల్లాలోని పలు తహశీల్దార్ కార్యాలయాల్లో సైట్ పని చేయకపోవడంతో కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురుచూస్తున్న యువకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏప్రిల్ 5 దరఖాస్తు చివరి తేదీ కావడంతో.. తహశీల్దార్ కార్యాలయాల చుట్టు తిరగాల్సి వస్తోందని, వెంటనే ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు.
Similar News
News November 7, 2025
జగిత్యాల: నీటిలో మునిగి యువకుడు మృతి

జగిత్యాల(D) ఇబ్రహీంపట్నం మం. మూలరాంపూర్ శివారులోని సదర్ మార్ట్ ప్రాజెక్ట్ వద్ద చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీటిలోపడి యువకుడు మృతి చెందినట్లు ఎస్సై అనిల్ కుమార్ తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్కు చెందిన పల్లికొండ సిద్దార్థ(18) బుధవారం చేపలుపట్టే సమయంలో ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మరణించినట్లు తండ్రి గంగన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.
News November 7, 2025
ఎందరికో ఆదర్శం అరుణిమా సిన్హా జీవితం

జాతీయ స్థాయి వాలీబాల్ ప్లేయర్గా ఎన్నో విజయాలు సాధించిన అరుణిమాను దొంగల రూపంలో విధి వెక్కిరించింది. వారిని అడ్డుకునే క్రమంలో ఆమెను కదులుతున్న రైలులోంచి బయటకు తోసేసారు. ఈ ప్రమాదంలో ఆమె కాలును పూర్తిగా తొలగించారు. ఇటువంటి పరిస్థితుల్లోనూ జీవితం ముగిసిపోయిందని ఆమె బాధపడలేదు. ఏదో ఒకటి సాధించాలనే తపనతో ఎవరెస్టు అధిరోహించిన ప్రపంచ తొలి మహిళా వికలాంగురాలుగా చరిత్ర సృష్టించారు.
News November 7, 2025
VJA: మాజీ డీసీపీ విశాల్ గున్ని కేసు అప్డేట్ ఇదే.!

విజయవాడ మాజీ డీసీపీ విశాల్ గున్ని సస్పెన్షన్ను ఉత్తర్వులను రద్దు చేయడంతో పాటు తక్షణం విధుల్లోకి తీసుకొని ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని ఇటీవల క్యాట్ ఉత్తర్వులను ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తారని విచారణను వాయిదా వేయాలి’ అని ప్రభుత్వ న్యాయవాది కోరారు. విచారణను నవంబర్ 11కి వాయిదా వేసింది.


