News March 5, 2025
భూపాలపల్లి: నేడే పరీక్షలు.. ALL THE BEST

భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 3,615 మంది విద్యార్థులు నేడు ఇంటర్ పరీక్ష రాయనున్నారు. ఫస్టియర్ 1,820, సెకండియర్లో 1,795 మంది విద్యార్థులు రాయనుండగా.. 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తంగా ఉండాలని, బీఎన్ఎన్ఎస్ 163(144) చట్టం అమలులో ఉంటుందని పోలీసులు తెలిపారు. కాగా, పరీక్షకు 30 నిమిషాలకు ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోండి.
ALL THE BEST
Similar News
News January 7, 2026
JNTU: వాయిదా పడిన బీ ఫార్మసీ పరీక్షలకు తేదీలు ఇవే!

JNTUకి సంబంధించి బీ ఫార్మసీ మొదటి సంవత్సరం సెకండ్ సెమిస్టర్తో పాటు, ఫస్ట్ సెమ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 27, 29న నిర్వహించనున్నట్లు ఎగ్జామినేషన్ డైరెక్టర్ వెల్లడించారు. నవంబర్ 4, 6వ తేదీన జరగవలసిన పరీక్షలు వాయిదా వేసిన నేపథ్యంలో నూతన తేదీలను ప్రకటించారు. దీనికి అనుగుణంగా అన్ని కళాశాలల ప్రిన్సిపల్స్ ఏర్పాటు చేసుకోవాలని అధికారులు సూచించారు.
News January 7, 2026
చిత్తూరు, తిరుపతి జిల్లాలో 600 ఉద్యోగాలు..!

SIPB సమావేశంలో తిరుపతి, చిత్తూరు జిల్లాలకు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. తిరుపతిలో ఎథీరియల్ ఎక్స్ప్లోరేషన్ గిల్డ్ రూ.578 కోట్లు, నవ ఫుడ్ సెంటర్ రూ.44.42 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ స్థాపించేందుకు గ్రీన్ సిగ్నల్ దక్కింది. మరోవైపు చిత్తూరు జిల్లాలో పయనీర్ క్లీన్ అంప్స్ సంస్థ రూ.159 కోట్ల పెట్టుబడితో యూనిట్ ఏర్పాటు చేయనుండగా.. దీనివల్ల సుమారు 600 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.
News January 7, 2026
HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.


