News March 30, 2025

భూపాలపల్లి: బాల్య వివాహాలకు అడ్డుకట్ట ఏదీ..!

image

భూపాలపల్లి జిల్లాలో బాల్య వివాహాల కట్టడికి అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ బాల్యవివాహాలు పెరుగుతున్నాయి. గ్రామాల్లో ఎక్కువగా పది, ఇంటర్ పూర్తి కాగానే ధనవంతుల కుటుంబాల సంబంధాలు వస్తే తల్లిదండ్రులు బాల్యవివాహాలకు మొగ్గు చూపుతూ వస్తున్నారు. బాల్యవివాహాల కట్టడికి అధికారులు అవగాహన సదస్సులు, జరిమానాలు సైతం విధిస్తున్నారు. కాగా 2018 నుంచి ఇప్పటి వరకు 123 బాల్య వివాహాలను అడ్డుకున్నారు.

Similar News

News December 3, 2025

కల్వకుర్తి ఆస్పత్రి.. 24 గంటల్లో 20 కాన్పులు

image

కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో గడచిన 24 గంటలలో 20 కాన్పులు జరిగినట్లు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శివరాం తెలిపారు. ఇందులో 11 నార్మల్ డెలివరీలు, 9 సిజేరియన్ కాన్పులు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారని తెలిపారు. ఇంత పెద్ద సంఖ్యలో విజయవంతంగా కాన్పులు చేసిన ఆసుపత్రి సిబ్బందిని సూపరింటెండెంట్ అభినందించారు.

News December 3, 2025

ఏలూరు: మార్నింగ్ వాక్ చేస్తుండగా ఢీకొట్టిన కారు.. వ్యక్తి మృతి

image

మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం జరిగింది. గ్రామానికి చెందిన ఘంటసాల రంగరాజు(55), ఇందుకూరి సుబ్బారావు మార్నింగ్ వాక్ చేస్తుండగా కైకలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు వీరిని ఢీకొట్టింది. ఈ ఘటనలో రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్ర గాయాలపాలయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారిస్తున్నారు.

News December 3, 2025

వేగంగా కాదు.. క్షేమంగా వెళ్లండి: సిద్దిపేట సీపీ

image

వేగంగా వెళ్లడం కాదు.. క్షేమంగా వెళ్లడం ముఖ్యమని సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎస్.ఎం.విజయ్ కుమార్ పేర్కొన్నారు. అతివేగం ఎప్పటికైనా ప్రమాదమే అని, వేగంగా వెళ్లి ప్రాణాలు కోల్పోవద్దని కోరారు. మీ నిర్లక్ష్యం ఇతరులకు శాపం కావద్దన్నారు. మీ క్షేమం కోసమే ట్రాఫిక్ నిబంధనలు అమలు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాలని సూచించారు. అతివేగంతో వెళ్లి మీ కుటుంబాన్ని రోడ్డున పడేయొద్దని అన్నారు.