News January 30, 2025
భూపాలపల్లి: బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ మండల కమిటీల నియామకం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో మండల కమిటీల నియామకం జరిగింది. రేగొండ మండలం అధ్యక్షుడిగా బండి రమేశ్, టేకుమట్ల మండలాధ్యక్షుడిగా చిలక సమ్మయ్య, మహముత్తారం మండలాధ్యక్షుడిగా కృష్ణను నియమించి వారికి నియామక పత్రాలను అందించినట్లు మహేందర్ తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.
Similar News
News December 2, 2025
‘కోహ్లీ’ దిగ్గజాలను దాటేశారు: ఫ్యాన్స్

SAపై తాజా సెంచరీతో వన్డేల్లో కోహ్లీ 52 సెంచరీలు చేసి ఓ ఫార్మాట్లో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్గా నిలిచారు. అయితే సెంచరీల్లో దిగ్గజ ప్లేయర్లను విరాట్ ఎప్పుడో దాటేశారని ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కోహ్లీ వన్డేల్లో 294 ఇన్నింగ్స్ ఆడారని, ఇదే సంఖ్యలో ఆడిన తర్వాత సచిన్ సెంచరీలు 33 అని, పాంటింగ్ 26, గేల్ 25 శతకాలు బాదారని పోస్టులు పెడుతున్నారు. బ్యాటింగ్ AVG కూడా కోహ్లీ(58)దే ఎక్కువ అని చెబుతున్నారు.
News December 2, 2025
ఫోన్లలో Govt యాప్.. నిఘా కోసమేనా?

ఫోన్లలో ప్రభుత్వ ‘సంచార్ సాథీ’ యాప్ <<18439451>>డిఫాల్ట్గా<<>> ఉండాలన్న కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నేరాలకు అడ్డుకట్ట వేసే పేరుతో ప్రజలపై నిఘా పెట్టాలనుకుంటున్నారని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రష్యా, నార్త్ కొరియా వంటి దేశాల్లోనే డిలీట్ చేసేందుకు వీలులేని ఇలాంటి యాప్స్ ఉన్నాయని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. నార్త్ కొరియాలా తమపై నిఘా పెడతారా అని ప్రశ్నిస్తున్నారు. మీ కామెంట్?
News December 2, 2025
ఉత్తరాంధ్రలో పెరిగిన కాలుష్యం

ఉత్తరాంధ్రలోని మూడు నగరాల్లో కాలుష్యం పెరిగింది. సోమవారం జరిగిన లోక్సభ సమావేశంలో హిందూపూరం MP పార్థసారథి అడిగిన ప్రశ్నకి కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ సమాధానం ఇచ్చారు. 2017-18తో పోలిస్తే 2024-25లో ఉత్తరాంధ్రలో గాలి నాణ్యత మరింత దిగజారింది. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళంలో పరిశ్రమలు వ్యర్థాలను సరిగ్గా శుద్ధి చేయకపోవడం వల్ల కాలుష్యం పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.


