News January 30, 2025
భూపాలపల్లి: బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ మండల కమిటీల నియామకం

భూపాలపల్లి జిల్లా కేంద్రంలో బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లా కన్వీనర్ క్యాతం మహేందర్ ఆధ్వర్యంలో మండల కమిటీల నియామకం జరిగింది. రేగొండ మండలం అధ్యక్షుడిగా బండి రమేశ్, టేకుమట్ల మండలాధ్యక్షుడిగా చిలక సమ్మయ్య, మహముత్తారం మండలాధ్యక్షుడిగా కృష్ణను నియమించి వారికి నియామక పత్రాలను అందించినట్లు మహేందర్ తెలిపారు. బీసీలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ ముందుకు వెళ్లాలన్నారు.
Similar News
News November 21, 2025
GNT: కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత దేవిప్రియ వర్ధంతి

ప్రముఖ కవి, రచయిత, పాత్రికేయుడు దేవిప్రియ (షేక్ ఖాజాహుస్సేన్) వర్ధంతి నేడు. గుంటూరులో జన్మించిన ఆయన ‘పైగంబర కవుల’ బృందంలో ఒకరు. ఆయన రచించిన ‘గాలిరంగు’ కవిత్వానికి 2017లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈయన పాత్రికేయుడిగా ‘ఉదయం’, ‘ఆంధ్రజ్యోతి’ వంటి దినపత్రికలలో పనిచేశారు. వ్యంగ్య, విమర్శనాత్మకమైన ఆయన ‘రన్నింగ్ కామెంటరీ’ కవిత్వం తెలుగు పత్రికా రంగంలో కొత్త ఒరవడిని సృష్టించింది.
News November 21, 2025
30న అఖిలపక్ష సమావేశం

DEC 1 నుంచి 19 వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నెల 30న అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వెల్లడించారు. చర్చల అజెండాలపై ఏకాభిప్రాయం, సజావుగా సమావేశాల నిర్వహణే లక్ష్యమని తెలిపారు. ఈసారి SIR అంశంపై అధికార, విపక్షాల మధ్య వాడీవేడి చర్చ సాగనుంది. శీతాకాల సమావేశాలను మరిన్ని రోజులు పొడిగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
News November 21, 2025
ADB: వైద్యుల నిర్లక్ష్యం.. తల్లిబిడ్డ మృతి

గుడిహత్నూర్ మండలం శాంతపూర్ గ్రామానికి చెందిన గర్భిణి చిక్రం రుక్మాబాయి నిన్న పురిటి నొప్పులతో 108 సహకారంతో ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెకు రెండవ కాన్పు సిజేరియన్ చేయగా, డెలివరీ తర్వాత నిన్న రాత్రి తల్లి, బిడ్డ ఇద్దరూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన భార్య, బిడ్డ మృతి చెందారని భర్త చిక్రం సుభాశ్ ఆరోపించారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.


