News February 28, 2025

భూపాలపల్లి: బోనస్ నగదు జమకాక రైతులు ఇబ్బందులు

image

రైతులకు వరి ధాన్యం బోనస్ నగదు జమ కాక ఇబ్బందులు పడుతున్నారు. ధాన్యం విక్రయించి 50 రోజులు గడుస్తున్నా నగదు జమ కావట్లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రూ.2,320 మద్దతు ధరతో పాటు.. క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తోందని, జిల్లాలో దాదాపు 81,700 మెట్రిక్ టన్నులు సన్న ధాన్యాన్ని విక్రయించగా రూ.16 కోట్లు మాత్రమే నగదు జమకాగ.. రూ.24 కోట్ల నగదు చెల్లించాల్సి ఉందని అధికారులు తెలిపారు.

Similar News

News October 24, 2025

జగిత్యాల: ‘రవాణా సమయంలో నిబంధనలు పాటించాలి’

image

హార్వెస్టర్ యంత్రాల రవాణా సమయంలో రోడ్డు రవాణా నిబంధనలు తప్పక పాటించాలని జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో హార్వెస్టర్ యంత్రాల యజమానులు, డ్రైవర్లతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. డ్రైవర్ లైసెన్సు, వాహన పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలన్నారు. అధికారులు, రైతులు, యజమానులు పరస్పర సహకారంతో వరికోతలు సజావుగా నిర్వహించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలన్నారు.

News October 24, 2025

జగిత్యాల: PSలలో విద్యార్థులు..!

image

పోలీస్ అమరవీరుల సంస్మరణ(Police Flag Day) వారోత్సవాల సందర్భంగా జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు PSల పనితీరు, డయల్ 100 సేవలు, FIR నమోదు విధానం, సీసీ కెమెరాల ఉపయోగం, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీ, ఫ్రెండ్లీ పోలీసింగ్, భరోసా సెంటర్ సేవలు, షీ టీంల వ్యవస్థ తదితర వాటిపై అవగాహన కల్పించారు.

News October 24, 2025

జగిత్యాల: వివాహిత ఆత్మహత్య.. భర్తకు 10ఏళ్ల జైలు

image

జగిత్యాల జిల్లా బీరపూర్ మండలం మంగేళకి చెందిన లహరి అలియాస్ ప్రియాంకను సారంగాపూర్ మండలం కోనాపూర్‌కి చెందిన రాజేందర్‌కు ఇచ్చి వివాహం చేశారు. ఈ క్రమంలో అదనపు వరకట్నం కోసం భర్త రాజేందర్ లహరిని వేధించడంచో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. నిందితుడు భర్తపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. విచారణ జరిపిన న్యాయమూర్తి నారాయణ గురువారం నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.