News March 5, 2025
భూపాలపల్లి: భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

కొడవటంచలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు, పూలతో అలంకరించాలని సూచించారు.
Similar News
News October 19, 2025
బాలికపై అత్యాచారం.. నిందితుడి అరెస్ట్: DSP అజీజ్

బాలికపై అత్యాచారానికి పాల్పడి ఆరు నెలల గర్భవతిని చేసిన వీరాంజనేయులును లాలాపేట పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు ఈస్ట్ డీఎస్పీ అబ్దుల్ అజీజ్ ఈ కేసు వివరాలను వెల్లడించారు. తన కూతురితో కలిసి చదువుకుంటున్న మరో బాలికను వీరాంజనేయులు లొంగదీసుకొని అత్యాచారం చేశాడని చెప్పారు. ఈ క్రమంలో అతడిని అదుపులోకి తీసుకొని పోక్సో కేసు నమోదు చేశామన్నారు.
News October 19, 2025
ప్రకృతి మాటున ప్రమాదం.. 14 మంది మృతి

ప్రకృతి అందాల మాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని పసిగట్టలేక పలువురు జల సమాధి అవుతున్న ఘటనలు కన్నీరు తెప్పిస్తున్నాయి. కైగల్, గంగనశిరస్సు, YSR జలాశయం, కళ్యాణరేవు వాటర్ ఫాల్స్ భారీ వర్షాలకు నిండు కుండలా మారాయి. పర్యాటకులు అప్రమత్తంగా లేకపోతే ప్రమాదాలు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు. ఏడేళ్లలో వాటర్ ఫాల్స్ ప్రమాదాలలో దాదాపు 14 మంది <<18040804>>మృతి<<>> చెందినట్లు సమాచారం.
News October 19, 2025
‘ఆట’ విడుపు.. క్రికెట్తో సేదదీరిన హైడ్రా సిబ్బంది

హైడ్రా సిబ్బంది శనివారం ఫతుల్గూడలోని క్రీడామైదానంలో ఫ్లడ్లైట్ల కాంతిలో క్రికెట్ ఆడుతూ సేదతీరారు. అసెట్స్ ప్రొటెక్షన్, డిజాస్టర్ మేనేజ్మెంట్ విభాగాల మధ్య జట్ల పోటీ ఉత్సాహంగా సాగింది. కమిషనర్ రంగనాథ్, అదనపు కమిషనర్లు అశోక్ కుమార్, సుదర్శన్, డైరెక్టర్ వర్ల పాపయ్య పాల్గొన్నారు. క్రీడలు జట్టు స్ఫూర్తిని పెంచుతాయని కమిషనర్ అన్నారు.