News March 5, 2025

భూపాలపల్లి: భక్తులకు ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్ 

image

కొడవటంచలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఈనెల 9 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. మంగళవారం బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. దేవాలయాన్ని విద్యుద్దీకరణ చేయడంతో పాటు, పూలతో అలంకరించాలని సూచించారు.

Similar News

News November 12, 2025

అల్లూరి ఏజెన్సీలో పడిపోయిన ఉష్ణోగ్రతలు

image

అల్లూరి ఏజెన్సీ ప్రాంతాల్లో బుధవారం ఉదయం ఉష్ణోగ్రతలు మరింత పడిపోయాయి. జిల్లాలో అత్యల్పంగా అరకులోయలో 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలి తీవ్రత పెరగడంతో పొగమంచు కమ్ముకుంది. దీంతో రహదారులు కనబడక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఏజెన్సీ ప్రజలు చలిమంటలు వేసుకొని వెచ్చదనం పొందుతున్నారు.

News November 12, 2025

భద్రాద్రి : ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్య

image

కుటుంబ సభ్యులకు దూరమయ్యాననే మనస్తాపంతో ఓ ట్రాన్స్‌జెండర్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ రామగోపాలపూర్‌లో చోటుచేసుకుంది. భద్రాద్రి జిల్లా చర్ల మండలం చిన్నమడిసిలేరు గ్రామానికి చెందిన శివప్రసాద్ అలియాస్ రాజేశ్వరి(20) నాలుగు నెలల క్రితం ట్రాన్స్‌జెండర్‌గా సర్జరీ చేయించుకుంది. కుటుంబానికి దూరమై బాధపడుతూ మంగళవారం తెల్లవారుజామున ఉరేసుకుని చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

గ్రామ పంచాయతీలకు శుభవార్త

image

AP: పట్టణాభివృద్ధి సంస్థల(UDA) పరిధిలోని గ్రామ పంచాయతీల్లో భూవినియోగ మార్పిడికి ఎక్స్‌టర్నల్ డెవలప్‌మెంట్ ఛార్జ్(EDC) విధిస్తారు. ఇందులో 15% UDAలకు, 85% పంచాయతీలకు చెందేలా ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నగదు UDA ఖాతాల్లోకి వెళితే తిరిగి రావడం కష్టమని అధికారులు అభిప్రాయపడటంతో వాటా మొత్తం నేరుగా పంచాయతీల ఖాతాలకే జమ అయ్యేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో గ్రామాలకు అదనపు ఆదాయం లభించనుంది.