News August 20, 2024
భూపాలపల్లి: మంత్రుల నేటి పర్యటన షెడ్యూల్ ఇదే!
నేడు భూపాలపల్లి జిల్లాలో మంత్రులు పర్యటించనున్నారు. ఉదయం 10గంటలకు కొడవటంచ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకొని, ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11:15 గంటలకు పాండవుల గుట్టను పరిశీలించనున్నారు. మధ్యాహ్నం 1గంటలకు ఘనపూర్ చెరువును, మధ్యాహ్నం 2:15 గంటలకు కోటగుళ్లను సందర్శిస్తారు. అనంతరం ములుగు జిల్లాలోని రామప్ప, లక్నవరం చెరువును సందర్శిస్తారు.
Similar News
News September 30, 2024
వరంగల్: ప్రజావాణికి భారీగా తరలి వచ్చిన ఫిర్యాదుదారులు
వరంగల్ జిల్లా కలెక్టరేట్లో ప్రజావాణి ఫిర్యాదులను సోమవారం కలెక్టర్ సత్య శారద స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 103 రాగా.. వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ శాఖకి సంబంధించి భూ సంబంధిత సమస్యలపై 53, జిల్లా విద్యా శాఖ, GWMCకి 6, వ్యవసాయ శాఖకి 5 దరఖాస్తులు వచ్చాయని, మిగతావి వివిధ శాఖలకు సంబంధించినవన్నారు.
News September 30, 2024
WGL: నేటి నుంచి టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ
వరంగల్-నల్గొండ-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం కాల పరిమితి మార్చి-29తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎలెక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు 108-భూపాలపల్లి నియోజకవర్గంలోని భూపాలపల్లి మండలానికి సంబంధించిన టీచర్ ఓటర్ల నమోదు ప్రక్రియ ఈనెల 30 నుంచి ప్రారంభం కానుందని తహశీల్దార్ తెలిపారు. కావున అర్హులయిన టీచర్లు అందరూ తమ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని తెలిపారు.
News September 30, 2024
వినతలను స్వీకరించిన వరంగల్ కలెక్టర్
వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి కలెక్టర్ సత్యశారదాదేవి వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజల వద్ద నుంచి కమిషనర్ అశ్విని తానాజీ వాకడే వినతులను స్వీకరించారు.