News February 2, 2025
భూపాలపల్లి: రేపు ప్రజావాణి రద్దు

భూపాలపల్లి జిల్లా సమీకృత కలెక్టరేట్లో సోమవారం నిర్వచించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న నేపథ్యంలో ప్రజావాణిని రద్దు చేసినట్లు చెప్పారు.
Similar News
News November 23, 2025
కామారెడ్డిలో కిలో చికెన్ రూ.240

కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు పలు మండలాలలో నాన్ వెజ్ ధరలు ఇలా ఉన్నాయి. కిలో మటన్ ధర రూ.800, బోటి కిలో రూ.400, చికెన్ కిలో రూ.240- రూ.260, లైవ్ కోడి కిలో రూ.150గా నిర్ణయించారు. కార్తీక మాసం ముగియడంతో మాంసం అమ్మకాలు కాస్త పెరిగాయని వ్యాపారస్థులు తెలిపారు.
News November 23, 2025
‘రైతన్న.. మీకోసం’ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్

ఈ నెల 24 నుంచి 29 వరకు జరిగే ‘రైతన్న.. మీకోసం’ వారోత్సవాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శనివారం భీమవరం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ప్రతి రైతుకూ అవగాహన కల్పించాలని, శాఖలన్నీ సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News November 23, 2025
ఆదిలాబాద్ కాంగ్రెస్ కొత్త సారథి నేపథ్యమిదే

ADB కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్షుడిగా గుడిహత్నూర్ మండలానికి చెందిన నరేశ్ జాదవ్ నియమితులైన విషయం తెలిసిందే. 2014 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో నిలిచారు. AICC మెంబర్గా ఉన్న ఆయన గత అసెంబ్లీ ఎన్నికల్లో బోథ్ అసెంబ్లీ నుంచి బరిలో నిలవాలనుకున్నా టికెట్ ఇవ్వలేదు. అయినా పార్టీలోనే కొనసాగుతూ తనదైన ముద్ర వేసుకున్నారు. పార్టీ పట్ల ఆయనకున్న విధేయతతోనే అధ్యక్ష పదవి వచ్చింది.


