News March 19, 2025

భూపాలపల్లి: లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరం: డీఎంహెచ్‌వో

image

లింగ నిర్ధారణ పరీక్ష చట్టరీత్యా నేరమని పరీక్ష చేయించిన వారు, చేసిన వారు, ప్రోత్సహించిన వారు, శిక్షార్హులు అవుతారని డీఎంహెచ్‌వో డా.మధుసూదన్ స్పష్టం చేశారు. ఆయన బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే 94405 86982 నంబరుకు సమాచారం అందించాలని సూచించారు. వైద్యులు పాల్గొన్నారు.

Similar News

News November 20, 2025

సిరిసిల్ల: శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానం

image

సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకుల కోసం దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన క్రీడ శాఖ అధికారి రామ్ దాసు తెలిపారు. PMSRI పాఠశాలల్లోని విద్యార్థినులకు ఆత్మ రక్షణ విద్యలో శిక్షణ ఇచ్చేందుకు 11 సెల్ఫ్ డిఫెన్స్ శిక్షకులు కావాలని పేర్కొన్నారు. కరాటే, కుంగ్ ఫూ, జూడో, కలారి పాయట్టులో అనుభవం ఉన్న శిక్షకులు ఈ నెల 25 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News November 20, 2025

మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

image

మంచిర్యాల- జగిత్యాల జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈ మార్గంలో రవాణా వ్యవస్థ మెరుగుపడనుంది. రూ.2, 250 కోట్ల వ్యయంతో 68 కిలోమీటర్ల మేర ఈపీసీ పద్ధతిలో ఈ జాతీయ రహదారి ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 317 హెక్టార్ల భూసేకరణ చేస్తారు. రహదారి నిర్మాణంతో ప్రయాణ సౌలభ్యం, వ్యవసాయ, వ్యాపార రవాణాకు దోహదపడనుంది.

News November 20, 2025

SAతో వన్డే సిరీస్‌కు కెప్టెన్ ఎవరు?

image

SAతో ODI సిరీస్‌కు IND కెప్టెన్‌గా ఎవరు వ్యవహరిస్తారనే దానిపై చర్చ జరుగుతోంది. గాయాల నుంచి కోలుకుంటున్న కెప్టెన్ గిల్, VC శ్రేయస్ ఈ సిరీస్‌లో ఆడడం కష్టమే. ఈ నేపథ్యంలో KL రాహుల్ లేదా అక్షర్ పటేల్‌కు కెప్టెన్సీ ఇచ్చే ఛాన్సుందని క్రీడా వర్గాలు చెబుతున్నాయి. గతంలో KLకు ODIsలో కెప్టెన్సీ చేసిన అనుభవముంది. ఒకవేళ అక్షర్‌కు అవకాశమిస్తే మరో కొత్త కెప్టెన్ వచ్చినట్లవుతుంది. తొలి ODI ఈనెల 30న జరగనుంది.