News February 2, 2025
భూపాలపల్లి: వాలీ బాల్ ఆడిన ఎమ్మెల్యే గండ్ర

భూపాలపల్లి పట్టణంలోని అంబేడ్కర్ స్టేడియంలో వాలీ బాల్ క్లబ్ గెట్ టు గెదర్ కార్యక్రమంలో ఆదివారం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పాల్గొని పోటీలను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు వాలీ బాల్ ఆడి సందడి చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదం చేస్తాయని ఎమ్మెల్యే అన్నారు.
Similar News
News March 11, 2025
స్మగ్లింగ్ కేసు: నటి ఇంట్లో CBI సోదాలు

కన్నడ నటి రన్యా రావ్ గోల్డ్ స్మగ్లింగ్ కేసు విచారణను CBI వేగవంతం చేసింది. ఆమె పెళ్లి చేసుకున్న వేదిక, ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు ఆరంభించినట్టు తెలిసింది. కీలక పత్రాలను పరిశీలిస్తున్నట్టు సమాచారం. అలాగే VVIPలు, పోలీసులు, రాజకీయ నాయకులతో ఆమె సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు తెలిసింది. ఒకవైపు DRI మరోవైపు CBI విచారణతో రన్యా రావ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రస్తుతం ఆమె కోర్టు కస్టడీలో ఉన్నారు.
News March 11, 2025
పార్వతీపురం: వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల పేదలకు స్వయం ఉపాధి పథకాలు

జిల్లాలోని దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతులు, అగ్రవర్ణాల్లోని పేదల అభివృద్ధి కోసం స్వయం ఉపాధి పథకం కింద యూనిట్ల స్థాపన, జెనరిక్ ఫార్మసీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 2024-25 ఆర్థిక సం.రంలో 21 నుంచి 60 ఏళ్ల వయసు ఉండి, దారిద్ర్య రేఖకు దిగువనున్న వెనుకబడిన తరగతుల వారి అభివృద్ధికి చర్యలు చేపట్టామన్నారు.
News March 11, 2025
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షకు 862 మంది గైర్హాజరు

శ్రీకాకుళం జిల్లాలో మంగళవారం జరిగిన ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షకు 862 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు జిల్లా ఆర్ఐఓ పీ.దుర్గారావు తెలిపారు. మొత్తం 22,075 మంది విద్యార్థులకు గాను 21,212 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు. కాగా మంగళవారం జరిగిన పరీక్షలో ఎక్కడా ఎటువంటి మాల్ ప్రాక్టీస్ నమోదు కాలేదని ఆర్ఐఓ తెలిపారు.