News February 4, 2025
భూపాలపల్లి: సింగరేణి ఉద్యోగులకు శుభవార్త

2024- 25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశిత బొగ్గు ఉత్పత్తి లక్ష్యం సాధించేందుకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ను ప్రవేశపెడుతూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. 72 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి జనవరి వరకు 53.73 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరిగింది. ఫిబ్రవరి, మార్చిలో మిగతా 18.27 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ఉద్యోగులకు స్పెషల్ ఇన్సెంటివ్ అందించనున్నారు.
Similar News
News November 13, 2025
ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదు: J&K సీఎం

ప్రతి కశ్మీరీ ముస్లిం టెర్రరిస్టు కాదని జమ్మూకశ్మీర్ CM ఒమర్ అబ్దుల్లా అన్నారు. ఢిల్లీ పేలుడు ఘటనను ఆయన ఖండించారు. అమాయకులను క్రూరంగా చంపడాన్ని ఏ మతమూ సమర్థించదని తెలిపారు. కశ్మీర్లో శాంతి, సోదరభావాన్ని నాశనం చేసేవారు కొందరు ఉంటారని విమర్శించారు. బ్లాస్ట్ కారకులను కఠినంగా శిక్షించాలని, అమాయకులను వదిలేయాలని కోరారు. ఓ డాక్టర్ను <<18268521>>ఉద్యోగం నుంచి తొలగించాక<<>> దర్యాప్తు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
News November 13, 2025
ప్రపంచ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో రష్మి అయ్యర్కు గోల్డ్ మెడల్

దక్షిణాఫ్రికాలోజరిగిన ప్రపంచ పవర్లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో నాగ్పూర్కు చెందిన రష్మీఅయ్యర్ గోల్డ్ మెడల్ గెలిచి రికార్డు సృష్టించారు. ఇందులో 22 దేశాల నుండి 390 మంది అథ్లెట్లు పాల్గొన్నారు. గతేడాది కజకిస్తాన్లో జరిగిన ఛాంపియన్షిప్లో కూడా గోల్డ్ మెడల్ సాధించిన ఆమె వరుసగా రెండుసార్లు ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించారు. గతేడాది స్పాన్సర్లు లేకపోవడంతో ఆమె తన బంగారం అమ్మి పోటీల్లో పాల్గొన్నారు.
News November 13, 2025
బాపట్లలో ఇంటర్ యువకుడు మిస్సింగ్

బాపట్లలో ఓ ఇంటర్ యువకుడు అదృశ్యమయ్యాడు. కర్లపాలేనికి చెందిన సాయినాథ్(16) బాపట్లలోని ఓ కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. నిన్న ఉదయం నుంచి కాలేజీకి వెళ్లి తిరిగి రాలేదు. ‘నేను విజయవాడకు వెళ్తున్నా’ అని సాయినాథ్ తన ఫ్రెండ్స్కు చెప్పినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఆచూకీ తెలియకపోవడంతో బంధువులు గాలిస్తున్నారు. ఎవరికైనా తెలిస్తే 8374922001 నంబర్కు కాల్ చేయాలని బంధవులు కోరుతున్నారు.


