News April 11, 2025
భూపాలపల్లి: సెల్ ఫోన్ సిగ్నల్ రావాలంటే చెట్లు ఎక్కాల్సిందే!

మహాముత్తారం మం.లోని యత్నారంలో సెల్ఫోన్ సిగ్నల్స్ లేకపోవడంతో గ్రామస్థులు ఇబ్బందులు పడుతున్నారు. సిగ్నల్ రావాలంటే ఎత్తైన ప్రదేశం లేదా చెట్లైనా ఎక్కాలి. లేదా ట్రాక్టర్ ట్రాలీపై నిల్చొని మాట్లాడాల్సి వస్తుందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి గ్రామంలో సెల్ టవర్ నిర్మించాలని, లేదా సమీప టవర్ సిగ్నల్ పరిధినైనా పెంచాలని కోరుతున్నారు. మీ ప్రాంతంలో సిగ్నల్ ఎలాఉందో కామెంట్ చేయండి.
Similar News
News November 10, 2025
అవాస్తవాలు ప్రచారం చేయద్దు: పలమనేరు DSP

ముసలిమడుగు ఎలిఫెంట్ క్యాంప్ ప్రారంభించడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన తిరుగు ప్రయాణంలో ఇందిరానగర్ వద్ద జరిగిన తోపులాటలో హేమలత అనే మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. దీనిని కొంతమంది సోషల్ మీడియాలో కాన్వాయ్ వాహనం ఢీకొనిందని దుష్ప్రచారం చేస్తున్నారు. అది పూర్తిగా అవాస్తవమని DSP ప్రభాకర్ తెలిపారు. ఎవరైనా ఈ విషయంపై మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు.
News November 10, 2025
కర్నూలు జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు: ఎస్పీ

కర్నూలు జిల్లాలో పటిష్ఠ భద్రతా చర్యలు చేపట్టినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఆదివారం జిల్లాలో నేర నియంత్రణకు పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు. అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా గస్తీలు, తనిఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు భద్రత నిబంధనలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
News November 10, 2025
కూతురి విజయం.. తండ్రికి మళ్లీ పోలీస్ జాబ్!

ఉమెన్స్ WC విన్నింగ్ టీమ్ సభ్యురాలైన క్రాంతి గౌడ్కు మధ్యప్రదేశ్ ప్రభుత్వం రూ.కోటి నజరానా ప్రకటించింది. అంతేకాకుండా 2012లో ఎన్నికల విధుల్లో పొరపాటు వల్ల పోలీస్ ఉద్యోగం కోల్పోయిన ఆమె తండ్రి మున్నాసింగ్కు తిరిగి కానిస్టేబుల్ జాబ్ ఇస్తామని తెలిపింది. తన తండ్రిని మళ్లీ యూనిఫామ్లో చూడటం, ఆయన గౌరవంగా రిటైర్ అయ్యేలా చేయడమే తన కల అని క్రాంతి పేర్కొన్నారు. ఒకప్పుడు తమకు తిండికి కూడా ఉండేది కాదన్నారు.


