News February 25, 2025
భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.
Similar News
News November 17, 2025
MNCL: బైక్ చక్రంలో చీరకొంగు ఇరుక్కొని మహిళ మృతి

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి ఘటన స్థానికంగా కలకలం రేపింది. గోదావరిఖని గోదావరి బ్రిడ్జి వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. MNCL జిల్లా వేమనపల్లికి చెందిన లత(35) తమ్ముడు అరుణ్ బైక్ పై GDK నుంచి ఇంటికి వెళ్తుంది. ఈ క్రమంలో తన చీర కొంగు వెనుక వీల్లో ఇరుక్కుపోవడంతో ఇద్దరు కింద పడ్డారు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా లత అక్కడికక్కడే మృతిచెందింది. టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 17, 2025
తెనాలి: విషాద ఘటనలు.. ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య

తెనాలి నియోజకవర్గంలో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెనాలి నాజరుపేటకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి పవన్ తేజ (24) ఆలస్యంగా ఇంటికి రావడంతో తల్లి మందలించగా మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మరో ఘటనలో కొల్లిపర మండలం జముడుబాడుపాలెంకి చెందిన విద్యార్థిని లావణ్య (20) అనారోగ్య సమస్యలతో ఆదివారం ఉరి వేసుకొని చనిపోయింది. ఈ రెండు ఘటనలపై వన్టౌన్, కొల్లిపర పోలీసులు కేసులు నమోదు చేశారు.
News November 17, 2025
నువ్వుల పంట కోతకు వచ్చిందా?

తెలుగు రాష్ట్రాల్లో ఆగష్టు నెలలో విత్తుకున్న నువ్వుల పంట ప్రస్తుతం కోత మరియు నూర్పిడి దశలో ఉంటుంది. పంటలో 75% కాయలు లేత పసుపు రంగులోకి వచ్చినప్పుడే పైరును కోయాలి. కోసిన పంటను కట్టలుగా కట్టి తలక్రిందులుగా నిలబెట్టాలి. 5-6 రోజులు ఎండిన తర్వాత కట్టెలతో కొట్టి నూర్పిడి చేయాలి. గింజల్లో తేమ 8 శాతానికి తగ్గేవరకు చూసుకోవాలి. ఆ తరువాతే గోనె సంచిలో నిల్వ చేయాలి. ఈ సంచులపై మలాథియాన్ పొడిని చల్లాలి.


