News February 25, 2025

భూపాలపల్లి: 8న జాతీయ లోక్ అదాలత్

image

మార్చి 8న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్న నేపథ్యంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జాతీయ లోక్ అదాలత్‌లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారం కోసం కృషి చేయాలని, సమన్వయంతో పనిచేయాలని అధికారులకు సూచించారు. లోక్ అదాలత్‌లో కేసులు పరిష్కరించుకుంటే కలిగే లాభాలను ప్రజలకు తెలియజేయాలన్నారు.

Similar News

News February 25, 2025

GOVT స్కూల్‌లో మహబూబాబాద్ జిల్లా కలెక్టర్

image

మహబూబాబాద్ పట్టణంలోని కేజీబీవీ పాఠశాలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం సందర్శించారు. క్లాస్ రూమ్ పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన డైట్ మెనూ ప్రకారం పక్కాగా ఉండాలని సూచించారు. ప్రతి సబ్జెక్టులో అత్యుత్తమ ప్రతిభ కనబరిచేందుకు విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించాలని తెలిపారు. అనంతరం క్లాస్ రూమ్‌లో పిల్లలతో మాట్లాడారు. వసతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

News February 25, 2025

మహబూబాబాద్: ప్రభుత్వ కార్యాలయాల్లో కలెక్టర్ తనిఖీ

image

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్‌ సముదాయంలోని అన్ని శాఖల కార్యాలయాలను కలెక్టర్ అద్వైత్ కుమార్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న కార్యకలాపాలపై సంబంధిత సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించాలని, ఉద్యోగులు క్రమం తప్పకుండా సమయపాలన పాటించాలని సూచించారు. అనంతరం ఉద్యోగుల హాజరు పట్టిక, రిజిస్టర్లను పరిశీలించారు.

News February 25, 2025

Stock Markets: ఉదయం లాభాలు.. సాయంత్రం నష్టాలు

image

స్టాక్‌మార్కెట్లు నేడు ఫ్లాటుగా ముగిశాయి. నిఫ్టీ 22,547 (-5), సెన్సెక్స్ 74,602 (147) వద్ద స్థిరపడ్డాయి. ఆటో, మీడియా, ఎఫ్ఎంసీజీ, కన్జూమర్ డ్యురబుల్స్ షేర్లు ఎగిశాయి. ఐటీ, మెటల్, ఫార్మా, PSU బ్యాంకు, రియాల్టి, O&G షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఎయిర్‌టెల్, ఎం&ఎం, బజాజ్ ఫైనాన్స్, నెస్లే ఇండియా, టైటాన్ టాప్ గెయినర్స్. డాక్టర్ రెడ్డీస్, హిందాల్కో, ట్రెంట్, హీరోమోటో, సన్‌ఫార్మా టాప్ లూజర్స్.

error: Content is protected !!