News March 28, 2025
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో భూముల క్రమబద్దీకరణకు మీసేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 30ని అనుసరించి 2025 పేరిట భూమి క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
Similar News
News November 22, 2025
షూటింగ్లో గాయపడిన హీరోయిన్

బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్ గాయపడ్డారు. Eetha మూవీలో ఓ సీక్వెన్స్ చిత్రీకరణ జరుగుతున్న సమయంలో ఆమె ఎడమకాలుకు దెబ్బ తగిలినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. దీంతో రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు పేర్కొంది. ఈ మూవీ లెజెండరీ లావణి నృత్యకారిణి విఠాబాయి బావు మంగ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. టైటిల్ రోల్లో శ్రద్ధా నటిస్తున్నారు.
News November 22, 2025
జగిత్యాల: నిరుద్యోగులకు రేపు జాబ్ మేళా

జగిత్యాల జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కోసం నవంబర్ 24న (ఆదివారం) ఉపాధి కల్పన కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు బి. సత్యమ్మ తెలిపారు. కృషి విజ్ఞాన్ హైదరాబాద్లో 67, గూగుల్ పేలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ 30 పోస్టులు ఉన్నాయన్నారు. ఇంటర్, డిగ్రీ అర్హత ఉన్నవారు హాజరు కావచ్చు. ఎంపికైన వారు జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, చొప్పదండి, ధర్మారం వంటి ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
News November 22, 2025
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టమాటా ధరలు శనివారం ఇలా ఉన్నాయి. ములకలచెరువులో నాణ్యత గల టమాటా 10 కిలోలు రూ. 520, పుంగనూరులో రూ. 500, పలమనేరులో రూ.490, వీకోటలో రూ.520, కలికిరిలో రూ.510, మదనపల్లెలో రూ. 630 వరకు పలుకుతున్నట్టు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ధరల పెరుగుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


