News March 28, 2025
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో భూముల క్రమబద్దీకరణకు మీసేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 30ని అనుసరించి 2025 పేరిట భూమి క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
Similar News
News November 15, 2025
అమరావతిలో భారీగా పెట్టుబడులు

అమరావతి రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టేందుకు వివిధ రకాల సంస్థలు ముందుకు వచ్చాయి. ఈ మేరకు సీఐఐ సదస్సులో పలు సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. సదస్సు తొలి రోజు లోనే సుమారు రూ. 32 వేల కోట్ల పెట్టుబడులను CRDA ఆకర్షించింది. మొత్తం ఎనిమిది సంస్థలు ఒప్పందాలు చేసుకున్నాయి. దీంతో అమరావతి ప్రాంత వాసులు, CRDA వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
News November 15, 2025
శ్రీకాంత్ను త్వరగా తీసుకురండి.. పెళ్లి చేసుకోవాలి: అరుణ

పెరోల్పై బయటికి వచ్చిన తర్వాత శ్రీకాంత్ని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, అనవసరంగా తనను కేసుల్లో ఇరికించారని లేడీ డాన్ అరుణ పోలీసులు ఎదుట వాపోయిందట. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో విజయవాడలోని సూర్యారావుపేట పోలీసులు 2 రోజులు ఆమెను కస్టడీకి తీసుకున్నారు. కస్టడీలో ఆమె పోలీసులకు సహకరించలేదని సమాచారం. శ్రీకాంత్కు త్వరగా బెయిల్ తీసుకురావాలని, తనను పెళ్లి చేసుకోవాలని కోరినట్లు సమాచారం.
News November 15, 2025
NFCలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

HYDలోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్(NFC)405 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. టెన్త్, ITI అర్హతగల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 18 – 25ఏళ్ల మధ్య ఉండాలి. టెన్త్ మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎలక్ట్రీషియన్ పోస్టులకు మాత్రం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


