News March 28, 2025
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో భూముల క్రమబద్దీకరణకు మీసేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 30ని అనుసరించి 2025 పేరిట భూమి క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
Similar News
News November 16, 2025
పల్నాడు: కాక రేపుతున్న వారసత్వ రాజకీయాలు

పల్నాడు జిల్లాలో వారసత్వ రాజకీయాలు కాక రేపుతున్నాయి. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలుగా ఉన్న యరపతినేని శ్రీనివాసరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కన్నా లక్ష్మీనారాయణ, జీవి ఆంజనేయులు తమ వారసులను రాజకీయ బరిలోకి దింపేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముందు నుంచే తమ వారసులను ప్రజలలోకి పంపి రాజకీయ ఒడిదుడుకులపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.
News November 16, 2025
త్వరలో HYDలో ఎనిమీ ప్రాపర్టీ ప్రాంతీయ కార్యాలయం

రాష్ట్రంలో ఎనిమీ ప్రాపర్టీలు పరిరక్షణ కోసం HYDలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు కానున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ముంబై ప్రాంతీయ కార్యాలయం తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల వ్యవహారాలు చూస్తోంది. హైదరాబాద్- రంగారెడ్డి జిల్లాల్లో ఎనిమీ ప్రాపర్టీలపై రెవెన్యూశాఖ సర్వే నిర్వహించింది. మియాపూర్ పరిధిలో వందల ఎకరాలు ఉండగా, కొంతభాగం అక్రమ ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు.
News November 16, 2025
కిలిమంజారోను అధిరోహించిన అనంత జిల్లా యువతి

అనంతపురం(D) నార్పల(M) దుగుమర్రికి చెందిన కె.కుసుమ(19) ఈ నెల 8న హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీస్టాండింగ్ పర్వతం కిలిమంజారో (5895M)ను 12న విజయవంతంగా అధిరోహించింది. శిఖరంపై జాతీయ జెండాతో పాటు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్, MLA బండారు శ్రావణి ఫొటోలను ఎగురవేసింది. 15న హైదరాబాద్కు చేరుకోనుంది.


