News March 28, 2025
భూముల క్రమబద్ధీకరణకు దరఖాస్తులు చేసుకోండి: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాలో భూముల క్రమబద్దీకరణకు మీసేవ కేంద్రాలు, గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్తో కలిసి ఆయన మాట్లాడుతూ.. జీవో నంబర్ 30ని అనుసరించి 2025 పేరిట భూమి క్రమబద్ధీకరణ చేపడతామన్నారు. డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తారన్నారు.
Similar News
News November 20, 2025
MNCL: స్థానిక సంస్థ ఎన్నికల సమర్థవంతంగా నిర్వహించాలి: ఎన్నికల కమిషనర్

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించేందుకు అవసరమైన కార్యచరణ రూపొందించాలన్నారు.
News November 20, 2025
మూవీ రూల్స్కు రీడైరెక్ట్ కావడంపై విచారణలో రవికి ప్రశ్నలు

ఐ-బొమ్మ కేసులో రవి పోలీస్ కస్టడీ తొలిరోజు ముగిసింది. వెబ్సైట్కు సంబంధించి కీలక విషయాలపై పోలీసులు ఆరా తీశారు. ఇవాళ వెలుగులోకి వచ్చిన ‘ఐబొమ్మ వన్’పైనా ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దాని నుంచి మూవీ రూల్స్కు రీడైరెక్ట్ కావడంపై రవిని అడిగారు. అతడు వాడిన మొబైల్స్ వివరాలు, నెదర్లాండ్స్లో ఉన్న హోమ్ సర్వర్ల డేటా, హార్డ్ డిస్క్ల పాస్వర్డ్, NRE, క్రిప్టో కరెన్సీ, పలు వ్యాలెట్లపై సుదీర్ఘంగా విచారించారు.
News November 20, 2025
50 అదనపు సీట్లు కోల్పోయిన పాడేరు మెడికల్ కాలేజీ!

పాడేరు ప్రభుత్వ వైద్య కళాశాల ఈ ఏడాది అదనంగా పొందాల్సిన 50 MBBS సీట్లను కోల్పోయింది. 2025–26 విద్యా సంవత్సరానికి 50 సీట్లు మంజూరు చేయాలని కళాశాల ప్రిన్సిపల్ NMCకి దరఖాస్తు చేశారు. అయితే పరిశీలనలో భాగంగా ఎన్ఎంసీ 2 ముఖ్య అంశాలపై అదనపు వివరణ కోరగా, డీఎంఈ కార్యాలయం సమయానికి స్పందించకపోవడం వల్ల ఫైల్ ముందుకు సాగకపోయినట్లు సమాచారం. దీనిపై మంత్రి సత్యకుమార్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.


