News February 20, 2025

భూముల రీసర్వే పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ 

image

జిల్లాలో భూముల రీసర్వే వేగవంతంగా, పకడ్బందీగా నిర్వహించి నివేధికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. బుధవారం విజయవాడ నుండి భూముల రీసర్వేపై సీసీఎల్ఏ జి జయలక్ష్మి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల్లో భూముల రీసర్వేపై ప్రత్యేక శ్రద్ధ వహించి పకడ్బందీగా నిర్వహించాలన్నారు. నివేదికలు పంపాలని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు. 

Similar News

News March 26, 2025

భీమవరం: ‘నేడు పదో తరగతి పరీక్షకు 517 డుమ్మా’

image

నేడు జిల్లాలో జరిగిన టెన్త్ భౌతిక శాస్త్ర పరీక్షకు 22,894 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 22,357మంది విద్యార్థులకు 517 గైర్హాజరయ్యారని డీఈవో నారాయణ తెలిపారు. ఓపెన్ స్కూల్ సైన్స్ , అండ్ టెక్నాలజీ పరీక్షకు 487 మంది విద్యార్థులకు గాను 379 విద్యార్థులు హాజరు కాగా 108 గైర్హాజరయ్యారని చెప్పారు.

News March 26, 2025

అచ్చెన్నకు నిమ్మల బర్త్‌ డే విషెస్

image

ఇవాళ వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచెన్నాయుడు జన్మదినం. ఈ సందర్భంగా ఆయనను మంత్రి నిమ్మల రామానాయుడు కలిశారు. అమరావతిలోని అచ్చెన్న కార్యాలయానికి వెళ్లి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూల బొకే అందించి శాలువాతో సన్మానం చేశారు.

News March 26, 2025

ప.గో: వైసీపీకి షాక్ తప్పదా..?

image

ప.గో జిల్లాలో వైసీపీకి షాక్ ఇవ్వడానికి కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు. అత్తిలి, యలమంచిలి ఎంపీపీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. యలమంచిలో 18 ఎంపీటీసీలకు గాను వైసీపీ 13, జనసేన 1, టీడీపీ 3 చోట్ల గెలిచింది. ఓ సీటు ఖాళీగా ఉంది. అత్తిలిలో టీడీపీకి 5, వైసీపీకి 15 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఆ రెండు చోట్లు ఐదారు మందిని కూటమిలోకి లాగి ఎంపీపీ పదవులను కైవసం చేసుకోవడానికి NDA నాయకులు పావులు కదుపుతున్నారు.

error: Content is protected !!