News June 14, 2024
భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ గౌతమ్
ఖమ్మం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈరోజు కలెక్టర్ గౌతమ్ జిల్లాలో రైల్వే, జాతీయ రహదారులు, సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియపై అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ.. భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను కలెక్టర్ గౌతమ్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Similar News
News October 5, 2024
KTDM: సమాధి వద్దే సూసైడ్ అటెంప్ట్
ఆళ్లపల్లి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన వెంకటేశ్ అనే వ్యక్తి శుక్రవారం పురుగు మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. స్థానికుల వివరాలిలా.. వెంకటేశ్కి వరుసకు కొడుకయ్యే ప్రవీణ్ ఇటీవల మృతిచెందాడు. ప్రవీణ్ సమాధి వద్దకు వెళ్లిన వెంకటేశ్ మనస్తాపంతో పురుగు మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. గమనించిన బంధువులు అతణ్ని కొత్తగూడెం ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News October 5, 2024
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓటర్ నమోదుకు అవకాశం
వరంగల్-ఖమ్మం-నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఓటర్లుగా నమోదుకు దరఖాస్తు చేసుకోవాలని డిప్యూటీ జిల్లా ఎన్నికల అధికారి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం అర్హులైన ఉపాధ్యాయులు నవంబర్ 6 లోపు ఫారం19 ద్వారా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. గతంలో ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్న ఉపాధ్యాయులు సైతం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
News October 4, 2024
ఖమ్మం: పువ్వాడ సైలెంట్.. ఎందుకు..?
ఖమ్మం జిల్లా బీఆర్ఎస్లో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ సైలెంట్ అయ్యారనే చర్చ నడుస్తొంది. జిల్లాలో జరిగే పార్టీ కార్యక్రమాలకు హాజరవడం లేదని, ఏదో అడపాదడపా HYDలో జరిగే ప్రెస్ మీట్లకు హాజరవుతున్నారని శ్రేణులు చర్చించుకుంటున్నాయి. పువ్వాడ ఎందుకు సైలెంట్ అయ్యారనే విషయం తమకు తెలియదని, తిరిగి పువ్వాడ జిల్లాలో యాక్టివ్ పాలిటిక్స్ చేసి, జోష్ పెంచాలని పలువురు నేతలు అంటున్నారు. దీనిపై మీ కామెంట్?