News April 10, 2025
భూ క్రమబద్ధీకరణకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి: జేసీ

భూముల క్రమబద్ధీకరణ పథకం -2025 కింద గృహ, నివాస యూనిట్ల అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను దరఖాస్తు చేసుకొని హక్కులు పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిశాంతి గురువారం తెలిపారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకుని నివాస గృహాలు నిర్మించుకున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారు నిత్యం తొలగింపునకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
వరంగల్ స్మార్ట్ సిటీ పనుల్లో జాప్యం.. సీఎం దృష్టి పెడతారా?

ఎంపీ ఎన్నికల సందర్భంగా వరంగల్ అభివృద్ధికి CM రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల్లో అనేక పనులు ఇంకా నిలిచిపోయాయి. మామునూరు ఎయిర్పోర్టు భూసేకరణకు రూ.150 కోట్లు, భద్రకాళి చెరువు పూడికతీత, మాడ వీధులు, స్మార్ట్సిటీ పనులు, అండర్గ్రౌండ్ డ్రెయినేజీ డీపీఆర్ సహా మొత్తం రూ.6,500 కోట్ల ప్రాజెక్టులు పురోగతి లేక నిలిచాయి. ఔటర్, ఇన్నర్ రింగ్రోడ్లు, మేడారం, గిరిజన వర్సిటీకి నిధులు త్వరగా విడుదల చేయాలని కోరుతున్నారు.
News December 5, 2025
విశాఖ: నమ్మించి రూ.1.97 కోట్లు కాజేశారు

మహిళను నమ్మించి ఆన్లైన్లో రూ.1.97 కోట్ల పెట్టుబడి పెట్టించి మోసం చేసిన తండ్రి కొడుకును 1 టౌన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించారు. సదరం శివ, ప్రేమ సాగర్ అక్కయ్యపాలెంకు చెందిన రమ్య రాజాకు ఆశ చూపించి ఆన్లైన్లో పెట్టుబడి పెట్టించడంతో పాటు 75 తులాల బంగారాన్ని తాకట్టు పెట్టించి డబ్బులు కాజేశారు. తన డబ్బులు ఇవ్వమని రమ్య అడగటంతో ఇబ్బందులకు గురి చేయాగా ఆమె పోలీసులును ఆశ్రయించారు
News December 5, 2025
తిరుమలలో కొన్ని పేర్లు మారుతున్నాయి!

తిరుమలలోని కొన్ని వీధుల పేర్లను మార్చేందుకు సీఎం చంద్రబాబు నాయుడుకు టీటీడీ ప్రతిపాదనలు పంపగా ఆయన ఆమోదం తెలిపారు. ఇప్పటివరకు ఆర్బ్ సెంటర్, మేదరమిట్ట, ముళ్లగుంత వంటి పేర్లకు బదులు శ్రీవారి సేవలో తరించిన పరమ భక్తుల పేర్లను పెట్టనున్నారు. వీటికి సంబంధించిన మార్పులను టీటీడీ త్వరలో అధికారికంగా అమలు చేసే అవకాశం ఉంది.


