News April 10, 2025
భూ క్రమబద్ధీకరణకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలి: జేసీ

భూముల క్రమబద్ధీకరణ పథకం -2025 కింద గృహ, నివాస యూనిట్ల అభ్యంతరం లేని ప్రభుత్వ భూములను దరఖాస్తు చేసుకొని హక్కులు పొందాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టీ. నిశాంతి గురువారం తెలిపారు. పెద్ద సంఖ్యలో కుటుంబాలు ప్రభుత్వ భూములను అనధికారికంగా ఆక్రమించుకుని నివాస గృహాలు నిర్మించుకున్నారన్నారు. ఎలాంటి పత్రాలు లేకపోవడంతో వారు నిత్యం తొలగింపునకు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Similar News
News November 17, 2025
శివ పూజలో తులసిని వాడుతున్నారా?

శివుడికి సంబంధించి ఏ పూజలు నిర్వహించినా అందులో మాల, తీర్థం ఏ రూపంలోనూ తులసిని వినియోగించకూడదనే నియమం ఉంది. శివ పురాణం ప్రకారం.. తులసి వృంద అనే పతివ్రతకు ప్రతిరూపం. ఆమె భర్త జలంధరుడిని శివుడు సంహరించాడు. అప్పుడు శివుడి పూజలో తన పవిత్ర రూపమైన తులసిని వాడరని శాపమిచ్చింది. అందుకే శివుడికి బిల్వపత్రాలు ప్రీతిపాత్రమైనవి. గణపతి పూజలోనూ తులసిని ఉపయోగించరు.
News November 17, 2025
iBomma ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా?

ఇమ్మడి రవి అరెస్టుతో iBomma, బప్పం టీవీ <<18302048>>బ్లాక్ <<>>అయిన విషయం తెలిసిందే. అయితే అవి ఆగినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అనే చర్చ నెట్టింట మొదలైంది. iBommaకు ముందు ఎన్నో పైరసీ సైట్లు ఉన్నాయని, ఇప్పటికీ కొనసాగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. వాటిపైనా చర్యలు తీసుకోవాలని, లేదంటే ఐబొమ్మ ప్లేస్లోకి అవి వస్తాయంటున్నారు. డిజిటల్ రైట్స్ మేనేజ్మెంట్ సాంకేతికతను ఉపయోగించుకోవాలని పేర్కొంటున్నారు. మీరేమంటారు?
News November 17, 2025
Wow.. సిద్దిపేట నుంచి ఇండియా టీంకు

అక్బర్పేట భూంపల్లి మండలం చిట్టాపూర్ గ్రామానికి చెందిన పోతనక అభిలాష్ డాడ్జ్బాల్ భారత జట్టుకు ఎంపికయ్యాడు. సిద్దిపేట నుంచి జిల్లా స్థాయికి, జాతీయ స్థాయికి ఎదిగిన అభిలాష్.. క్రికెట్తో సహా ఇతర క్రీడల్లోనూ చురుకైన పాత్ర పోషించేవాడు. దేశంలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులతో జరిగిన టెస్టులో మెరుగైన ప్రతిభ కనబరిచి జాతీయ జట్టులో సుస్థిర స్థానం సంపాదించిన అతడని జిల్లా వాసులు అభినందిస్తున్నారు.


