News April 16, 2025
భూ భారతి, ఇళ్ల పంపిణీపై KMR కలెక్టర్ సమీక్ష

భూ భారతి పై విస్తృత ప్రచారం చేపట్టాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. భూ భారతి అవగాహన సదస్సులు మే 17 నుంచి 30 మధ్య నిర్వహించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల జాబితాలను కమిటీల ద్వారా మే 2న గ్రామ సభలో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.
Similar News
News November 3, 2025
‘బాహుబలి-ది ఎపిక్’.. 3రోజుల కలెక్షన్స్ ఎంతంటే?

అక్టోబర్ 31న విడుదలైన ‘బాహుబలి-ది ఎపిక్’ సినిమా 3 రోజుల్లో రూ.38.9 కోట్లు కలెక్ట్ చేసినట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఇందులో ఇండియాలోనే రూ.27.9Cr వచ్చినట్లు పేర్కొన్నాయి. బాహుబలి పార్ట్-1, పార్ట్-2ను కలిపి ‘బాహుబలి-ది ఎపిక్’ పేరుతో రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇదే గ్రేటెస్ట్ ఫిల్మ్ అని, లైఫ్ టైమ్లో ఇలాంటి సినిమా ఒక్కసారే వస్తుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News November 3, 2025
తాజా వార్తలు

☛ చేవెళ్ల యాక్సిడెంట్.. 19మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి
☛ జోగి రమేశ్ను 10రోజుల కస్టడీకి కోరుతూ ఎక్సైజ్ శాఖ పిటిషన్.. కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ రేపటికి వాయిదా వేసిన VJA కోర్టు
☛ రాష్ట్రంలోని దుర్మార్గాలకు ఆద్యుడు లోకేశ్. ఉద్దేశపూర్వకంగానే YCP నేతలపై కేసులు: సజ్జల
☛ INDతో చివరి 2 T20లకు హెడ్ దూరం
☛ TNలో SIRకు వ్యతిరేకం.. సుప్రీం కోర్టును ఆశ్రయించినట్లు డీఎంకే వెల్లడి
News November 3, 2025
నెదర్లాండ్స్లో మంత్రి సీతక్కకు ఘన స్వాగతం

మంత్రి సీతక్క నెదర్లాండ్స్ పర్యటన కొనసాగుతోంది. అంతర్జాతీయ మహిళా నాయకత్వ వేదిక ‘వైటల్ వాయిసెస్ గ్లోబల్ ఫెలోషిప్’సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రికి అక్కడ ఘన స్వాగతం లభించింది. మహిళా సాధికారత, గ్రామీణ పేదరిక నిర్మూలనపై చర్చిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సెమినార్లలో ఆయా దేశాల ప్రతినిధులతో సీతక్క మాట్లాడుతున్నారు. వీటికి సంబంధించిన ఫొటోలను సీతక్క తన వాట్సప్ స్టేటస్లో స్వయంగా పోస్ట్ చేశారు.


