News April 15, 2025
భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు: జనగామ కలెక్టర్

భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులకు సూచించారు. మంగళవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో డిప్యూటీ తహశీల్దార్లు, డీపీఎంలు, ఏపీఎంలతో భూ భారతి – కొత్త ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆహార భద్రత కార్డుల పరిశీలన ప్రక్రియ, ధాన్యం కొనుగోళ్లపై గూగుల్ మీట్ ద్వారా సమీక్షించారు.
Similar News
News September 19, 2025
గ్రేటర్ HYD అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

భారీ వర్షాల నేపథ్యంలో HYD ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు ఈరోజు కీలక ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాలు కురుస్తుండటతో వరద నీరు సిటీ రోడ్లను ముంచెత్తుతోందని, ఎక్కడెక్కడ మ్యాన్ హోళ్లకు మూతలు లేవో అర్థం కావడం లేదన్నారు. మ్యాన్ హోల్స్ వద్ద తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని జీహెచ్ఎంసీ సిబ్బందిని ఆదేశించారు. ముఖ్యంగా ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని కోరారు.
News September 19, 2025
BREAKING: జూనియర్ ఎన్టీఆర్కు గాయం

సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. హైదరాబాద్లో జరిగిన ఓ యాడ్ షూటింగ్లో తారక్ స్వల్పంగా గాయపడ్డట్లు ఆయన టీమ్ తెలిపింది. రెండు వారాల పాటు ఆయన విశ్రాంతి తీసుకుంటారని చెప్పింది. అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది.
News September 19, 2025
కవితపై దాడి చేయాలని చూస్తున్నారు: రేవంత్

TG: CM రేవంత్ మీడియాతో చిట్చాట్లో పలు అంశాలపై మాట్లాడారు. ‘నేను కవితకు సపోర్ట్ చేయడం లేదు. ఆమె కాంగ్రెస్లోకి వస్తానంటే ఒప్పుకోను. KCR, KTR, హరీశ్రావు కలిసి ఆడపిల్లపై దాడి చేయాలని చూస్తున్నారు. ఇది వారి ఇంటి సమస్య. వారిని ప్రజలు బహిష్కరించారు. కాళేశ్వరం విచారణ బాధ్యతను CBIకి అప్పగించి చాలా రోజులైనా కిషన్రెడ్డి ఎందుకు మాట్లాడట్లేదు? KTR ఏం చెప్తే కిషన్రెడ్డి అది చేస్తారు’ అని వ్యాఖ్యానించారు.