News February 9, 2025

భూ భారతి దరఖాస్తులను పరిష్కరించాలి: ASF కలెక్టర్

image

భూ భారతి దరఖాస్తులను పరిశీలించి పరిష్కరించాలని ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తహశీల్దార్‌ను ఆదేశించారు. శనివారం మధ్యాహ్నం 3గంటలకు రెబ్బెన మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయాన్ని ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.  పత్రాల కోసం వచ్చిన దరఖాస్తులను నిర్ణీత గడువులోగా జారీ చేయాలని ఆదేశించారు.

Similar News

News February 12, 2026

TG CET హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 12, 2026

కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: వనపర్తి ఎస్పీ సునీత రెడ్డి

image

వనపర్తి జిల్లాలోని వనపర్తి, కొత్తకోట, ఆత్మకూర్, అమరచింత, పెబ్బేరు, మున్సిపాలిటీల్లో కౌంటింగ్ కేంద్రాల వద్ద 850 మంది పోలీసుఅధికారులతో కట్టుదిట్టమైన మూడంచెల భారీ భద్రత ఏర్పాటు చేశామని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. ఎస్పీ మాట్లాడుతూ.. మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు అనుమతి లేదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పనిసరిగా పాటించాలన్నారు.

News February 12, 2026

మన్యంకొండ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం లెక్కింపు

image

మహబూబ్‌నగర్ జిల్లా మన్యంకొండలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో గురువారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. హుండీ ద్వారా మొత్తం రూ.37,64,907 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. లెక్కింపు కార్యక్రమాన్ని ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త అలహరి మధుసూదన్ కుమార్, ఈవో శ్రీనివాస రాజు, ఇన్‌స్పెక్టర్ వీణా సమక్షంలో నిర్వహించారు. మేనేజర్ మల్లికార్జున్, పలువురు పాల్గొన్నారు.