News March 6, 2025
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: MNCL కలెక్టర్

జిల్లాలో శాంతిభద్రతలకు అవరోధంగా మారే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీ ప్రతినిధులు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారన్నారు. సందేహాల నివృత్తికి 08736 250106 కాల్ చేయాలని సూచించారు.
Similar News
News November 19, 2025
నల్గొండ: నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోలు షురూ

జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు బందును విరమించాయి. సీసీఐ నిబంధనలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జిన్నింగ్ మిల్లులు మంగళవారం బంద్ పాటించాయి. దీంతో రంగంలోకి దిగిన సీసీఐ సీఎండీ జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ నేతలతో భేటీ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మిల్లులను 2, 3 రోజుల్లో తెరుస్తామని హామీ ఇవ్వడంతో మిల్లుల యజమానులు బంద్ ఉపసంహరించుకున్నారు. నేటి నుంచి మళ్లీ పత్తి కొనుగోళ్లు చేయనున్నారు.
News November 19, 2025
NLG: పత్తి కొనుగోళ్లు నత్తనడకే!..

ఉమ్మడి జిల్లాలో పత్తి కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి జిల్లాలో 7.81 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు అయినట్లు అంచనా. ఇందులో నుంచి సాధారణంగా అయితే 95 లక్షల క్వింటాళ్ల వరకు పత్తి దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు 98,492 క్వింటాళ్ల పత్తి మాత్రమే కొనుగోలు చేశారు. ఇదిలా ఉండగా, కపాస్ కిసాన్ యాప్తో పాటు సీసీఐ నిబంధనలు రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి.
News November 19, 2025
రాష్ట్రస్థాయి పోటీలకు కొత్తఏరువారిపల్లి విద్యార్థిని ఎంపిక

సింగరాయకొండ మండలం పాకాలలో జరిగిన అండర్- 14 ఖోఖో రాష్ట్రస్థాయి ఎంపిక పోటీల్లో కనిగిరి మండలం కొత్త ఏరువారిపల్లి హైస్కూల్ విద్యార్థిని హర్షవర్ధని సత్తా చాటి ప్రకాశం జిల్లా తరఫున రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైనట్లు PET అహ్మద్ చెప్పారు. హర్షవర్ధనికి ఉపాధ్యాయులు, సర్పంచ్ వెంకటయ్య, గ్రామస్థులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉన్నత ప్రతిభ కనబరచాలని వారు కోరారు.


