News March 6, 2025
భూ సమస్యల పరిష్కారానికి చర్యలు: MNCL కలెక్టర్

జిల్లాలో శాంతిభద్రతలకు అవరోధంగా మారే భూసంబంధిత సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. మండల, సబ్ డివిజన్, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేసే కమిటీ ప్రతినిధులు ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు అర్జీదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించి గ్రీవెన్స్ నంబర్ కేటాయిస్తారన్నారు. సందేహాల నివృత్తికి 08736 250106 కాల్ చేయాలని సూచించారు.
Similar News
News February 16, 2026
కడప: ఇవాళే లాస్ట్.. అప్లై చేశారా?

కడప డివిజన్ పరిధిలోని సావిశెట్టిపల్లి, వెంకటరెడ్డి పల్లితో పాటు 26 చోట్ల బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అలాగే ప్రొద్దుటూరు డివిజన్ పరిధిలోని దొరసాని పల్లి, సిరిగే పల్లి, సుద్ధపల్లె తదితర గ్రామాల్లో 32 పోస్టులను భర్తీ చేస్తారు. జీతం రూ.12 వేల నుంచి రూ.24,470. పదో తరగతి పాసైతే చాలు. ఖాళీల వివరాల కోసం ఇక్కడ <
News February 16, 2026
సంగారెడ్డి: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

మంజీర నదిలో చేపలు పట్టేందుకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికుల వివరాల ప్రకారం.. HYD రాజేంద్రనగర్కు చెందిన మహమ్మద్ అబ్దుల్ సమద్ ఆదివారం స్నేహితుడితో కలిసి శివంపేట సమీపంలో నదిలో చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు నీటిలో మునిగి గల్లంతయ్యాడు. ఘటనపై సంగారెడ్డి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమద్ కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ, ఆచూకీ లభించలేదు.
News February 16, 2026
బాపట్లలో పీజీఆర్ఎస్ రద్దు: SP

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను కొన్ని అనివార్య కారణాల వల్ల ఇవాళ జరిగే కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఫిర్యాదుల కోసం సుదూర ప్రాంతాల నుంచి జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించాలన్నారు. అర్జీదారులకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని పేర్కొన్నారు.


