News March 18, 2025
భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

తిరుపతి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణ సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారు నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ శుభం బన్సల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 24, 2025
మంథని నుంచి జాతీయ వేదికకు.. కృష్ణ త్రీడీ ప్రతిభకు గౌరవం

JNTUH డైమండ్ జూబ్లీ వేడుకల్లో 3D ఆర్టిస్ట్ మంథనికి చెందిన ఎస్ఎస్ఆర్ కృష్ణకు యంగ్ అచీవర్ అవార్డు ప్రదానం చేశారు. JNTU కొండగట్టు నుంచి అవార్డు పొందిన ఏకైక విద్యార్థి కావడం విశేషం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, మంత్రి శ్రీధర్ బాబు కృష్ణ 3D ఆర్ట్ను ప్రశంసించారు. దక్షిణ భారతంలో అరుదైన 3D ఆర్ట్ను అభివృద్ధి చేస్తున్న కృష్ణకి గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు.
News November 24, 2025
ముంబైలో “పాతాళ్ లోక్” నెట్వర్క్

ముంబైని ‘ట్రాఫిక్ ఫ్రీ’ నగరంగా తీర్చిదిద్దేందుకు MH ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముంబైలో భారీ టన్నెల్ నెట్వర్క్ నిర్మిస్తామని CM దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించారు. ఈ టన్నెల్ నెట్వర్క్ ఇప్పటికే ఉన్న రోడ్లతో ప్యారలల్గా ఉంటుందని తెలిపారు. ఈ సొరంగ మార్గాన్ని ఫేమస్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘పాతాళ్ లోక్’తో ఫడణవీస్ పోల్చారు. ఈ నెట్ వర్క్తో ముంబై ప్రజల ట్రాఫిక్ కష్టాలు తీరుతాయని చెప్పారు.
News November 24, 2025
ASF కలెక్టర్, జడ్జిని కలిసిన నూతన SP

ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రేను, జిల్లా జడ్జి ఎం.వి.రమేశ్ను నూతన SP నితికా పంత్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. రెండు రోజుల క్రితం బాధ్యతలు స్వీకరించిన ఆమె ఈరోజు వారిని కలిసి పూల మొక్క అందజేశారు.న్యాయ వ్యవస్థ, పోలీస్ శాఖ సమన్వయంతో పనిచేయాలని, కేసుల పరిష్కారం, మహిళల భద్రత, నేరాల నియంత్రణపై చర్చించారు.


