News March 18, 2025
భూ సేకరణ త్వరగా పూర్తి చేయండి: కలెక్టర్

తిరుపతి జిల్లా పరిధిలో జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించి భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో భూసేకరణ సంబంధించి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ రహదారు నిర్మాణాలకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ శుభం బన్సల్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
NGKL: గ్రామపంచాయతీ రిజర్వేషన్లు ఖరారు..!

గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఈనెల 26, లేదంటే 27 తేదీలలో వెలువడే అవకాశం ఉన్నందున గ్రామ పంచాయతీల వారీగా రిజర్వేషన్లను ఖరారు చేశారు. గెజిట్ నోటిఫికేషన్ రావలసి ఉంది. జిల్లాలో మొత్తం 460 గ్రామపంచాయతీలకు 50 శాతం రిజర్వేషన్లు ఉంచకుండా రిజర్వేషన్లను ఖరారు చేసినట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. బీసీలకు 22 శాతం రిజర్వేషన్లు ఖరారు చేశారు.


