News October 26, 2024
భృూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పరచాలి: కలెక్టర్ పమేలా

భ్రూణ హత్యలు జరగకుండా ప్రజలను చైతన్య పర్చాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి అధికారులకు సూచించారు. ఆడ, మగ ఇద్దరినీ ఒకేలా చూడాలని చెప్పారు. ప్రతి శుక్రవారం జరిగే సభలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎవరైనా లింగ నిర్ధారణ పరీక్షలు చేసినా, లేక ప్రోత్సహించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
Similar News
News July 6, 2025
కాశ్మీర్ విషయంలో ముఖర్జి దృఢమైన వైఖరి: బండి సంజయ్

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, గొప్ప దేశభక్తుడు డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతిని పురస్కరించుకొని కరీంనగర్ ఎంపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నివాళులర్పించారు. డాక్టర్ ముఖర్జీ దేశానికి చేసిన సేవలను, ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. దేశ సమైక్యత, సమగ్రత కోసం ఆయన పడిన తపనను, ముఖ్యంగా కశ్మీర్ విషయంలో ఆయన దృఢమైన వైఖరిని బండి సంజయ్ కొనియాడారు. కార్యక్రమంలో బీజేపీ నేతలు ఉన్నారు.
News July 6, 2025
KNR నుంచి అరుణాచలానికి RTC ప్రత్యేక బస్సు

ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా అరుణాచలానికి KNR 1 డిపో నుంచి సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ తెలిపారు. ఈ నెల 8న KNR బస్టాండ్ నుంచి బయలుదేరి 9న కాణిపాకం, గోల్డెన్ టెంపుల్ దర్శనం తదుపరి రాత్రికి అరుణాచలం చేరుకుంటుందన్నారు. గిరిప్రదక్షిణ, దర్శనం అనంతరం 10న అరుణాచలం నుంచి మధ్యాహ్నం బయలుదేరుతుందన్నారు. మరుసటి రోజు జోగులాంబ దర్శనం తర్వాత 11వ తేదీ సాయంత్రం వరకు KNRకు చేరుకుంటుందన్నారు.
News July 6, 2025
కరీంనగర్: ఈ నెల 13లోగా అప్లై చేయాలి

జాతీయ ఉపాధ్యాయ అవార్డులు 2025కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. అర్హులైన ఉపాధ్యాయులు ఈ నెల 13లోగా http://nationalawardstoteachers.education.gov.in వెబ్పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాలని కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి శ్రీరాం మొండయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.