News February 26, 2026
భైంసాలో షీటీం భరోసా.. కలిసిన కుటుంబాలు

ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో బుధవారం జిల్లా ఎస్పీ జానకి షర్మిల గ్రీవెన్స్ నిర్వహించారు. ఇందులో షీ టీం కీలక పాత్ర పోషించింది. కుటుంబ వివాదాలతో వచ్చిన వారికి షీ టీం సిబ్బంది ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చి విడిపోయిన వారిని తిరిగి కలిపారు. కౌన్సిలింగ్ కోసం నిర్మల్ వరకు వెళ్లే భారం తప్పించి భైంసాలోనే ఈ సదుపాయం కల్పించడం పట్ల బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ ఎస్పీకి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News April 18, 2026
సంజామల @44.8°C

నంద్యాల జిల్లా సంజామలలో శుక్రవారం రికార్డు స్థాయిలో 44.8°C గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైనట్లు ఏపీ విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. బయటకు వెళ్లేటప్పుడు వేడిగాలి చెవుల్లోకి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా జాగ్రత్తలు పాటించాలని ఆయన స్పష్టం చేశారు.
News April 18, 2026
ద్విచక్ర వాహనాలు ఢీ.. పదో తరగతి విద్యార్థి మృతి

టేక్మాల్ (M) ఎల్లంపల్లి వద్ద శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సండ్రు సదానందం (16) మృతి చెందగా, శెట్టి గోపాల్ (28) తీవ్రంగా గాయపడ్డాడు. వీరిద్దరూ వేర్వేరు బైక్లపై వెళ్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. ఆస్పత్రికి తరలించేలోపే సదానందం ప్రాణాలు కోల్పోయినట్లు గ్రామస్థులు తెలిపారు. మృతుడు ఇటీవలనే SSC పరీక్షలు రాశాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 18, 2026
ఏప్రిల్ 18: చరిత్రలో ఈరోజు

* 1809: కవి, పండితుడు హెన్రీ డెరోజియా జననం
* 1880: రచయిత టేకుమళ్ల అచ్యుతరావు జననం
* 1958: విండీస్ మాజీ క్రికెటర్ మాల్కం మార్షల్ జననం
* 1859: స్వాతంత్ర్యసమరయోధుడు తాంతియా తోపే మరణం
* 1955: శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ మరణం(ఫొటోలో)
* 1980: సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ జననం
* ప్రపంచ సాంస్కృతిక దినోత్సవం
* ప్రపంచ వారసత్వ దినోత్సవం


