News July 12, 2024
భైంసా: మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య
మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుబీర్ మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చాత గ్రామానికి చెందిన చందుల సాయిలు గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై మద్యం మత్తులో పరుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతుని కుమారుడు అంజయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీందర్ తెలిపారు.
Similar News
News September 30, 2024
ADB: రేపు అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
ఆదిలాబాద్ జెడ్పీ సమావేశ మందిరంలో మంగళవారం మహిళ, శిశు, వికలాంగుల, వయోవృద్దుల సంక్షేమ శాఖ, తెలంగాణ వయోవృద్ధుల సమాఖ్య, ఆధ్వర్యంలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖ అధికారి సబిత పేర్కొన్నారు. వయోవృద్ధులు అధిక సంఖ్యలో హాజరుకావాలని పేర్కొన్నారు. అలాగే ఉచిత వైద్య శిబిరం నిర్వహించుచున్నట్లు తెలిపారు.
News September 30, 2024
ఆదిలాబాద్: కాసేపట్లో DSC రిజల్ట్స్.. అభ్యర్థులు వీరే!
DSC ఫలితాలు కాసేపట్లో విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో STG పోస్టుల వివరాలు ఇలా ఉన్నాయి. ADBలో 148 పోస్టులకు 4514 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:30గా ఉంది. ASFలో 190 పోస్టులకు 2710 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:14గా ఉంది. MNCLలో 165 పోస్టులకు 2527 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:15గా ఉంది. NRMLలో 175 పోస్టులకు 2372 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా పోటీ 1:13గా ఉంది.
News September 30, 2024
జన్నారం: నేడు పట్టు పరిశ్రమపై రైతులకు అవగాహన
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులకు పట్టు పరిశ్రమ/పట్టుపురుగుల పెంపకంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారని మండల వ్యవసాయ అధికారులు తెలిపారు. సోమవారం ఉ.10 గంటలకు జన్నారం పట్టణంలోని పొన్కల్ రైతు వేదికలో అవగాహన కార్యక్రమం ఉంటుందన్నారు. పట్టు పరిశ్రమ సహాయ సంచాలకులు వస్తున్నారని వారు వెల్లడించారు. జన్నారం మండలంలోని అన్ని గ్రామాల రైతులు కూడా సకాలంలో రావాలని వారు సూచించారు.