News March 12, 2025
భైంసా: మాల్ ప్రాక్టీస్.. నలుగురు విద్యార్థులు బుక్

భైంసా గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం జరిగిన ఓపెన్ డిగ్రీ 3వ సెమిస్టర్ పరీక్షలో మాల్ ప్రాక్టీస్కు పాల్పడుతూ నలుగురు విద్యార్థులు బుక్ అయినట్లు కళాశాల ప్రిన్సిపల్ బుచ్చయ్య పేర్కొన్నారు. ఈ సెంటర్లో ఇప్పటివరకు జరిగిన 5వ, 3 వ సెమిస్టర్ పరీక్షల్లో మొత్తంగా 20 మంది విద్యార్థులు బుక్ అయినట్లు వెల్లడించారు.
Similar News
News December 9, 2025
ఎన్నికలకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలి: నల్గొండ కలెక్టర్

నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి గ్రామపంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. కనగల్ ఎంపీడీవో ఆఫీస్, సాయిరాం ఫంక్షన్ హాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ మెటీరియల్, బ్యాలెట్ పేపర్లు, బాక్సులను పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. పోలింగ్ కేంద్రాల వారీగా సామాగ్రి సిద్ధం చేయాలని, బ్యాలెట్ పత్రాలు, బాక్సులు ప్రాపర్గా చెక్ చేయాలని సూచించారు.
News December 9, 2025
తూ.గో: డిప్యూటీ సీఎం శాఖలో జీతాల కష్టాలు

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆర్డబ్ల్యూఎస్ శాఖలో ఉద్యోగులు జీతాలు అందక ఆకలి కేకలు వేస్తున్నారు.
తూ.గో జిల్లా నీటి నాణ్యత పరీక్షా కేంద్రాల సిబ్బందికి ఆగస్టు నుంచి ఐదు నెలల వేతనాలు అందలేదు. క్రిస్మస్, సంక్రాంతి సమీపిస్తున్న వేళ జీతాలు రాకపోవడంతో వేతన జీవుల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వెంటనే బకాయిలు చెల్లించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
News December 9, 2025
ఎన్నికల పర్యవేక్షణ నిరంతరం కొనసాగాలి: కలెక్టర్

ఎన్నికలను పారదర్శకంగా, నిష్పాక్షికంగా నిర్వహించడంలో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాల పాత్ర కీలకమని జనరల్ అబ్జర్వర్ రవి కిరణ్, కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ బృందాలు, తహశీల్దార్లతో వారు ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలుపై సమీక్ష నిర్వహించారు. పోలింగ్ పూర్తయ్యే వరకు అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని వారు ఆదేశించారు.


