News April 15, 2025
భైంసా: 10 నిమిషాల్లోనే ఆనందం ఆవిరి

భైంసా బైపాస్ రోడ్డుపై ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. మృతుడు సుమన్ భైంసా పట్టణంలోని శుభకార్యాన్ని ముగించుకొని బయలుదేరిన 10 నిమిషాల్లోనే ప్రమాదంలో జరిగింది. సుమన్ మృతి చెందడంతో కుటుంబంలో విషాదాన్ని నింపింది. పోస్టుమార్టం కోసం భైంసా ఏరియా ఆసుపత్రిలో మృతదేహాన్ని ఉంచారు. అప్పటివరకు అందరితో కలిసున్న సుమన్ నిమిషాల వ్యవధిలోనే మృతి చెందిన వార్త తెలియడంతో బంధువులు శోకసముద్రంలో మునిగిపోయారు.
Similar News
News December 5, 2025
దోస్త్ మేరా దోస్త్

మన దేశంలో ప్రభుత్వాలు మారినా రష్యాతో సంబంధాలు మాత్రం అలాగే ఉన్నాయి. 1971లో భారత్-పాకిస్థాన్ యుద్ధంలో అమెరికా పాక్కు సపోర్ట్ చేసింది. అయితే సోవియట్ యూనియన్ (ఇప్పుడు రష్యా) భారత్ వైపు నిలబడింది. బంగాళాఖాతంలో సబ్మెరైన్తో మోహరించగానే అమెరికా సైన్యం భయపడి వెనక్కి వెళ్లిపోయింది. దీంతో ఆ యుద్ధంలో భారత్ గెలిచింది. మనం వాడుతున్న యుద్ధవిమానాల్లో 80% రష్యా నుంచి దిగుమతి చేసుకున్నవే కావడం విశేషం.
News December 5, 2025
చెరువు మట్టితో చాలా లాభాలున్నాయ్

చెరువులోని పూడిక మట్టిని పొలంలో వేస్తే భూమికి, పంటకు చాలా మేలు జరుగుతుంది. చెరువులో నీరు నిల్వ ఉన్నప్పుడు ఆకులు, గడ్డి వ్యర్థాలు కుళ్లి మట్టిలో చేరతాయి. వేసవిలో చెరువులు అడుగంటుతాయి. అప్పుడు చెరువు మట్టిని పొలాల్లో వేస్తే నత్రజని, భాస్వరం, పొటాషియం, జింకు, బోరాన్, సేంద్రియ కర్భన పదార్థాలతో పాటు.. మొక్కల పెరుగుదలకు కావాల్సిన సూక్ష్మ జీవులు, పంటకు మేలు చేసే మిత్ర పురుగులు నేలలో వృద్ధి చెందుతాయి.
News December 5, 2025
రంప: పాఠశాలలో ఆడుకుంటు..కుప్పకూలిన విద్యార్థిని

రంపచోడవరం మండలం తామరపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం విషాద ఘటన చోటు చేసుకుంది. 4వ తరగతి విద్యార్థిని కె. జానుశ్రీ పాఠశాలలో తోటి విద్యార్థులతో ఆడుకుంటుండగా..ఫీట్స్ వచ్చి పడి పోయింది. బాలిక పేరెంట్స్, టీచర్స్ హుటాహుటిన రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారరు.


