News September 1, 2024

‘భోగాపురం ఎయిర్‌పోర్టుకు మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ వేగ‌వంతం’

image

భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యానికి మౌలిక వ‌స‌తులను క‌ల్పించే ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని క‌లెక్ట‌ర్ అంబేడ్కర్ ఆదేశించారు. విమానాశ్ర‌యానికి వ‌స‌తుల క‌ల్ప‌న‌, భూ సేకరణ తదితర అంశాలపై తన ఛాంబర్‌లో శనివారం సమీక్షించారు. ఎయిర్‌పోర్టుకు నీటిని అందించేందుకు సుమారు రూ.20కోట్ల‌తో చేప‌ట్టిన ప‌నుల‌పై ఆరా తీశారు. ఈ ప‌నుల‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాల‌న్నారు.

Similar News

News November 2, 2025

పర్యాటక ప్రోత్సాహానికి హోమ్ స్టే విధానం: కలెక్టర్

image

పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, పర్యాటకులకు తక్కువ ఖర్చుతో నాణ్యమైన వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం హోమ్ స్టే, బెడ్ అండ్ బ్రేక్ ఫాస్ట్ విధానాన్ని ప్రవేశపెట్టిందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం తెలిపారు. హోమ్ స్టేలు ఏర్పాటు చేయాలనుకునే యజమానులు పర్యాటక శాఖ మార్గదర్శకాల ప్రకారం 1 నుంచి 6 గదులు అద్దెకు ఇవ్వవచ్చన్నారు. ఆసక్తి ఉన్న వారు nidhi.tourism.gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News November 2, 2025

క్షతగాత్రులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటనలో 9 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. మరి కొంతమంది తీవ్ర గాయాలు పాలై పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆసుపత్రికి చేరుకొని క్షతగాత్రులను పరామర్శించారు. వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందుతుందని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

News November 1, 2025

సహాయక చర్యల్లో విజయనగరం జిల్లా ఎస్పీ

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగిన నేపథ్యంలో ఎస్పీ ఏ.ఆర్. దామోదర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన భక్తులను ఆసుపత్రులకు తరలించి, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర రెడ్డితో కలిసి అక్కడి పరిస్థితులను సమీక్షించారు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడి ఘటనపై ఆరా తీశారు.