News June 17, 2024
భోగాపురం ఎయిర్పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తాం: కేంద్ర మంత్రి

భోగాపురం ఎయిర్పోర్టును రికార్డ్ స్థాయిలో పూర్తి చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం జిల్లాకు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుకు అవమానం జరిగిన చోటే రికార్డు మెజారిటీ సాధించామన్నారు. భోగాపురం ఎయిర్పోర్టు వస్తే అభివృద్ధి జరిగి ఎన్నో కంపెనీలు వస్తాయన్నారు. తప్పు చేసిన వారిని దేవుడు సైతం క్షమించడని వైసీపీ నాయకులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
Similar News
News February 26, 2026
శ్రీకాకుళం: పాత పైప్లైన్ల తొలగింపు

శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి నీటి కాలుష్యమే ప్రధాన కారణమని భావిస్తున్న అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ట్యాంకర్ల ద్వారా స్వచ్ఛమైన నీటిని అందిస్తున్నారు. డ్రైనేజీల పక్కన ఉన్న పాత పైప్లైన్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. సేకరించిన 412 వాటర్ శాంపిల్స్ను పరీక్షల నిమిత్తం విశాఖపట్నం ల్యాబ్లకు పంపగా, ప్రాథమిక రిపోర్టుల ప్రకారం నీరు సురక్షితంగానే ఉన్నట్లు సమాచారం.
News February 26, 2026
శ్రీకాకుళం: గూడ్స్ రైలు నుంచి విడిపోయిన బోగీలు

మందస మండలం మకరజోల వద్ద విశాఖ నుంచి కోల్కతా వైపునకు వెళ్తున్న గూడ్స్ రైలు ఆరు బోగీలు విడిపోయాయి. మిగిలిన బోగీలతో 100 మీటర్లు ముందుకు వెళ్లి నిలిపివేశారు. దీంతో మకరజోల మీదుగా ఉద్దానం గ్రామాలకు వెళ్లే రహదారిపై రైలు క్రాసింగ్ వద్ద వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. స్థానికులు గంటపాటు ఇబ్బందులు పడ్డారు.
News February 26, 2026
శ్రీకాకుళం జిల్లాకు కొత్త ఆఫీసర్

శ్రీకాకుళం జిల్లా పంచాయతీ అధికారిగా కె. గోపి బాలను ప్రభుత్వం నియమించింది. బుధవారం రాత్రి ప్రస్తుతం డీపీవోగా పనిచేస్తున్న భారతి సౌజన్యను బదిలీ చేశారు. గోపి బాల శ్రీకాకుళం డివిజనల్ పంచాయతీ అధికారిగా విధులు నిర్వహిస్తుండగా ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. గురువారం ఆయన బాధ్యతలు స్వీకరిస్తారని సమాచారం.


