News April 15, 2025
భోగేశ్వర ఆలయంలో జిల్లా కలెక్టర్ పూజలు

గడివేముల మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ దుర్గా భోగేశ్వరస్వామి ఆలయంలో నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి సోమవారం పూజలు నిర్వహించారు. దర్శనానికి వచ్చిన కలెక్టర్ రాజకుమారికి ఆలయ ఈఓ రామానుజన్, ఆలయ అర్చకులు శ్యాంసుందర్ శర్మ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామివారిని దర్శించుకుని అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన చేపట్టారు. దర్శనం అనంతరం స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించారు.
Similar News
News July 8, 2025
ఉమ్మడి NZB జిల్లా ఇన్ఛార్జ్గా అజ్మత్ హుస్సేన్

స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరగాల్సి ఉండగా అందుకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ సన్నదమవుతుంది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ 10 ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను సోమవారం నియమించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్గా కాంగ్రెస్ సీనియర్ నేత అజ్మత్ ఉల్లా హుస్సేన్ను నియమించింది. ఈయన ప్రస్తుతం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఛైర్మెన్గా ఉన్నారు.
News July 8, 2025
JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.
News July 8, 2025
లండన్లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.