News July 3, 2024
భోజన నాణ్యతలో రాజీపడొద్దు: డీఈవో

కేజీబీవీలో చదువుతున్న విద్యార్థినులకు వడ్డిస్తున్న భోజనంలో రాజీపడొద్దని, నాణ్యంగా అందించాలని కర్నూలు డీఈవో శామ్యూల్ అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న సమగ్రశిక్షా కార్యాలయంలో కేజీబీవీ ఎస్ఓలతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో ఉత్తీర్ణత పెంచేందుకు ప్రతి ఎస్ఓ ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో ఏమైనా సమస్యలుంటే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని పేర్కొన్నారు.
Similar News
News March 1, 2026
రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యం: కర్నూలు SP

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు తగ్గుతాయని శనివారం ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. జిల్లాలో జనవరి 1 నుంచి ఫిబ్రవరి 27 వరకు ఓవర్ స్పీడ్ (1,536), హెల్మెట్ లేకుండా (1,388), సెల్ఫోన్ డ్రైవింగ్ (392), ట్రిపుల్ రైడింగ్ (63) కేసులపై ఈ-చలాన్లు నమోదు చేశారు. అదనంగా 548 డ్రంకెన్ డ్రైవింగ్, 1,107 ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు.
News March 1, 2026
పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం కావాలి: కర్నూలు కలెక్టర్

కర్నూలు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా జీడీడీపీ తలసరి ఆదాయం పెంపుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ సిరి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని అధికారులకు వివరించారు.
News February 28, 2026
కర్నూలు: ‘పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వాలి’

కర్నూలు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ సిరి శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించారు. పెండింగ్ లేకుండా త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద వచ్చిన దరఖాస్తులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలన్నారు.


