News August 20, 2024

మంకీపాక్స్‌పై అప్రమత్తంగా ఉండాలి: మంత్రి దామోదర

image

మంకీపాక్స్ వ్యాధి వ్యాప్తిపై వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఈ వ్యాధి కేసులు నమోదు కాలేదని అధికారులు మంత్రికి వివరించారు. వ్యాధి నివారణ, చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. గాంధీ, ఫీవర్ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మంకీపాక్స్ నివారణ మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

Similar News

News February 16, 2025

మెదక్: ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

image

కౌడిపల్లి మండల కేంద్రంలోని PHCని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, రోగుల గదులు, మందుల నిల్వ ఉండే గదులను పరిశీలించారు. రోగులతో సేవల గురించి ఆరా తీశారు. సేవలు బాగున్నాయా, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. డాక్టర్లు, సిబ్బంది బాగా పనిచేస్తున్నారని గతంలో ఒకసారి తనిఖీ చేసినపుడు సేవలు సరిగా ఉండేవి కావని గుర్తు చేశారు.

News February 16, 2025

మెదక్: ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి: కలెక్టర్

image

ట్రాఫిక్ నియమాలు పాటించాలని కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సూచించారు. మెదక్ కలెక్టరేట్లో రోడ్డు ప్రమాదాల నివారణపై నేషనల్ హైవే, ఆర్అండ్బీ అధికారులతో శనివారం జిల్లా కలెక్టర్, ఎస్పీతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

News February 15, 2025

సంగారెడ్డి: నేను పుస్తకాలు చదవలేదు: జగ్గారెడ్డి

image

యువతకు ఉపయోగపడే ఐటీఐఆర్ ప్రాజెక్టు తీసుకురావాలని తాను బీజేపీ ఎంపీలకు అడిగితే.. తనకు ఐటీఐఆర్ ఫుల్‌ఫాం తెలియదంటూ ఎద్దేవా చేయడం ఎంపీ రఘునందన్‌రావుకు తగదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజంగా తాను పుస్తకాలు చదువుకోలేదని కేవలం ప్రజల మనస్తత్వం మాత్రమే చదివానని చెప్పారు. గాంధీ భవన్‌లో మీడీయాతో ఆయన మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కందికి ఐఐటీ తీసుకువచ్చానన్నారు.

error: Content is protected !!